బోధన్, నవంబర్ 30: బోధన్ పట్టణంలోని ఇందూర్ హైస్కూల్ విద్యార్థులు జాతీయ సైన్స్ కాంగ్రెస్లో ప్రతిభ చాటారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఎస్ఎఫ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ కాంగ్రెస్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 200లకు పైగా ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించారు. ఇందూర్ పాఠశాల నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థినులు స్నేహ, ఉదయని ప్రదర్శించిన ప్రాజెక్ట్కు జిల్లా స్థాయి మొదటి బహుమతి దక్కింది. సదరు విద్యార్థినులను బుధవారం బోధన్ ఇందూర్ పాఠశాల ఆవరణలో కరస్పాండెంట్ కొడాలి కిశోర్, పాఠశాల సిబ్బంది అభినందించారు. ప్రధానోపాధ్యాయుడు కెఎస్ రామారావు, అడ్మినిస్ట్రేటివ్ ఇన్చార్జి స్వాతి, హాస్టల్ ఇన్చార్జి అశోక్, ఉపాధ్యాయులు ఉన్నారు.
ఏర్గట్ల, నవంబర్ 30: జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్లో ఏర్గట్ల జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రతిభ చూపి జిల్లా ప్రాజెక్టు స్థాయి బహుమతులు గెలుపొందినట్లు ప్రధానోపాధ్యాయుడు మునీరుద్దీన్, భౌతిక రసాయన శాస్త్ర ఉపాధ్యాయుడు రాజశేఖర్ బుధవారం తెలిపారు. 30వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ -2022లో జిల్లా స్థాయి ప్రాజెక్టులో తమ పాఠశాల నుంచి రుచిత, చరణ్య, సంవిద, రస్మిత పాల్గొన్నారని తెలిపారు. వీరిలో రుచిత, చరణ్యలకు బహుమతులు లభించాయని పేర్కొన్నారు. పాఠశాల ఉపాధాయుడు శ్రీధర్ ప్రోత్సాహకంగా రూ.500 నగదును అందజేశారని తెలిపారు.