నిజామాబాద్ : మహాశివరాత్రి సందర్భంగా ఆర్మూర్ పట్టణంలోని నవ సిద్దులగుట్టలో ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతనంగా ఏర్పాటు చేసిన ఉత్తద్వారం ద్వారా శివాలయన్ని దర్శించుకున్నారు. ఘాట్ రోడ్ నుంచి కాలినడకన సిద్దులగుట్ట పైకి ఎమ్మెల్యే చేరుకున్నారు. ఘాట్ రోడ్ నిర్మించిన తీరును భక్తులకు వివరించారు.
మహాశివరాత్రి సందర్భంగా రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రల నుంచి భక్తులు తరలివచ్చారు. ఘాట్ రోడ్ నిర్మాణం ఒక అద్భుతం అని భక్తులు ప్రశంసించారు.