అన్నాచెల్లెళ్ల అనురాగ బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ వేడుకలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గురువారం ఘనంగా నిర్వహించారు. సోదరులకు బొట్టు పెట్టి, రాఖీ కట్టి, మంగళహారతులిచ్చి మిఠాయిలు తినిపించారు. ఈ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు ఎల్లవేళలా రక్షగా ఉంటామని ఆశీర్వదిస్తూ సోదరులు కానుకలను ఇచ్చారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు, ప్రముఖులు రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు.
స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎమ్మెల్యేలు జీవన్రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా, జాజాల సురేందర్, డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పోచారం సురేందర్రెడ్డి తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.
– నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఆగస్టు 31