నిజామాబాద్ క్రైం, డిసెంబర్ 12 : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని రాజారాం స్టేడియంలో ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థుల ఈవెంట్స్ కొనసాగుతున్నాయి. నాల్గో రోజైన సోమవారం మహిళా అభ్యర్థులకు మాత్రమే నిర్వహించారు. ఉదయం 5 గంటలకు ప్రారంభమైన ఈ శారీరక దారుఢ్య పరీక్షలను సీపీ నాగరాజు పర్యవేక్షణలో సాయం త్రం వరకు నిర్వహించారు.
1328 మంది అభ్యర్థులను పిలువగా 1207 మంది హాజరయ్యారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్, బయోమెట్రిక్తో పాటు 800 మీటర్ల పరుగు పందెం నిర్వహించి అర్హత సాధించిన వారికి మిగతా ఈవెంట్స్ నిర్వహించారు. నాల్గో రోజు 690 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు అధికారులు వెల్లడించారు. అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. శారీరక దారుఢ్య పరీక్షలు ఈ నెల 22వ తేదీ వరకు కొనసాగుతాయని తెలిపారు.
ఈ ఎంపిక సమయంలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అరవింద్ బాబు, అదనపు డీసీపీ గిరిరాజు, నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, సీసీఎస్, హోమ్గార్డ్స్, ట్రాఫిక్, సీటీసీ ఏసీపీలు ఏ.వెంకటేశ్వర్, ఆర్.ప్రభాకర్ రావు, కె.ఎం.కిరణ్ కుమార్, రమేశ్, శ్రీనివాస్, నారాయణ, శ్రావణ్ కుమార్, ఏఆర్ ఏసీపీ సంతోష్, కామారెడ్డి ఏఆర్ డీఎస్పీ ఉదయ్ కృష్ణ, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులుతో పాటు పోలీస్ వెల్ఫేర్ దవాఖాన డాక్టర్ సరళ, ఫిజికల్ డైరెక్టర్లు, పీఈటీలు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.