ఏర్గట్ల, డిసెంబర్ 4: మండలంలోని తాళ్ల రాంపూర్ గ్రామానికి చెందిన దొంతుల గంగమోహన్, శ్రీదేవి దంపతులు గోమాతను పెంచుకుంటున్నారు. గోవు గర్భందాల్చి ఐదు నెలలు పూర్తి కావడంతో ఇంటి వద్ద సీమంతం నిర్వహించారు.
తాము రెండేండ్ల క్రితం నుంచి ఆవు లేగను పెంచుకున్నట్లు తెలిపారు. ఆవు తమ కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మారిందని పేర్కొన్నారు. దీంతో అది గర్భం దాల్చడంతో సీమంతం నిర్వహించి భోజనాలు పెట్టినట్లు వారు తెలిపారు. గ్రామస్తులు ఆ దంపతులను అభినందించారు.