ఖలీల్వాడి, ఫిబ్రవరి 22: కులగణనతోనే ఎస్సీ వర్గీకరణ, అన్ని కులాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని మాదిగ సంఘాల రాష్ట్ర చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. మాదిగల జోడో యాత్రలో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని గౌతంనగర్ చౌరస్తాలో యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్గీకరణపై బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల సమస్యలు అలాగే ఉండిపోయాయని తెలిపారు. కేవలం కులగణన చేస్తేనే ఎస్సీ వర్గీకరణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా నాయకులు శ్రీనివాస్, గోవర్ధన్, శివ, శివకుమార్, విజయ్కుమార్, మహేందర్, మహేశ్, రమేశ్, గణేశ్ పాల్గొన్నారు.