సంక్రాంతి అంటేనే పతంగుల పండుగ. పగటి పూటే తారలు దిగివచ్చినట్లుగా.. నింగికి నిచ్చెన వేసినట్టుగా .. ఎగిరే రంగురంగుల పతంగులు కనువిందు చేస్తాయి. చిన్నా, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ పతంగులు ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతారు. ప్రతిసారిలాగే.. ఈ ఏడాది కూడా అందమైన పతంగులు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. మార్కెట్లో విభిన్న రకాల పతంగులు దర్శనమిస్తున్నాయి. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరినీ ఆకట్టుకోవడంతో పతంగులు ఎగురవేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పండుగ ముందు పతంగుల దుకాణాలు కొనుగోలుదారులతోసందడిగా మారాయి.
మార్కెట్లో పతంగులు, చెరకలు, దారాలు, మాంజాలు విక్రయిస్తున్నారు. గాలి పటం సైజు నాణ్యతను బట్టి రెండు రూపాయల నుంచి రూ. 150 వరకు (ప్లాస్టిక్) కాగితంతో చేసినవి అందుబాటులో ఉన్నా యి. రెండు కాగితాలతో చేసినవి సైజును బట్టి రూ. 5 నుంచి 40 వరకు విక్రయిస్తున్నారు. మాంజాలలో పాండే, పెన్సిల్ కట్, కీంచ్కట్ వివిధ ధరల్లో లభ్యమవుతున్నారు. యువత వీటిని కొనడానికి ఇష్టపడుతున్నారు.