నమస్తే తెలంగాణ యంత్రాంగం, ఫిబ్రవరి 7 : జిల్లావ్యాప్తంగా పారిశుద్ధ్య వారోత్సవాలను బుధవారం చేపట్టారు. గ్రామాల్లో పారిశుద్ధ్య సిబ్బంది పరిశుభ్రత పనులు చేపట్టగా.. అధికారులు పరిశీలించారు. ఈనెల 15వ తేదీ వరకు పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
రుద్రూర్ మండలంలోని రాయకూర్ క్యాంపులో ప్రత్యేకాధికారి, ఎంపీడీవో బాలగంగాధర్ పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. పారిశుద్ధ్య కార్మికులతో కలిసి మొక్కలకు నీరు పోశారు. వర్ని మండల కేంద్రంలోని సత్యనారాయణపురం గ్రామ పంచాయతీ పరిధిలో ఎంపీడీవో బషీరుద్దీన్ పారిశుద్ధ్య పనులను ప్రారంభించారు. డిచ్పల్లి మండలం నడిపల్లి పంచాయతీ పరిధిలో చేపట్టిన పనులను మండల ప్రత్యేకాధికారి రాజేందర్, ఎంపీడీవో గోపీబాబు, ఎంపీవో శ్రీనివాస్గౌడ్ పరిశీలించారు. ధర్పల్లిలో చేపట్టిన పారిశుద్ధ్య పనుల్లో ఎంపీడీవో లక్ష్మణ్, ఎంపీవో రాజేశ్తో కలిసి పాల్గొని శ్రమదానం చేశారు.
జక్రాన్పల్లి మండలంలోని కొలిప్యాక్లో ప్రత్యేకాధికారి, ఎంపీడీవో బ్రహ్మానందం, మండల పశు వైద్యాధికారిణి శిరీష పారిశుద్ధ్య కార్మికులతో వీధులను శుభ్రం చేయించారు. ఇందల్వాయి మండలంలోని గన్నారంలో గ్రామ ప్రత్యేకాధికారి, ఎంపీడీవో రాములునాయక్ పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. మోర్తాడ్ మండలకేంద్రంలో ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలను జడ్పీచైర్మన్ దాదన్నగారి విఠల్రావు ప్రారంభించారు. మాక్లూర్ బస్టాండ్ ఆవరణలో ఉన్న చెత్తను అధికారులతో కలిసి ఎత్తివేసి రోడ్లను ఊడ్చి శుభ్రం చేశారు. డీపీవో జయసుద, ఎంపీడీవో జైక్రాంతి, ఎంపీవో శ్రీనివాస్, కార్యదర్శి రాకేశ్ పాల్గొన్నారు. కమ్మర్పల్లి మండలం బషీరాబాద్లో రోడ్లు, డ్రైనేజీలను ఎంపీటీసీ జ్యోతి, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో శుభ్రం చేశారు.
బోధన్ మండలంలో ప్రత్యేక పారిశుద్ధ్ద్య కార్యక్రమాలను బోధన్ ఎంపీడీవో పర్బన్న, వైస్ఎంపీపీ కోట గంగారెడ్డి పాల్గొన్నారు. రెంజల్ మండలంలో పారిశుద్ధ్య వారోత్సవాలు ప్రారంభమైనట్లు ఎంపీడీవో శంకర్ తెలిపారు. వారం రోజుల పాటు పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మాక్లూర్ మండలకేంద్రంతోపాటు గాండ్లపేట్లో ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, దోన్పాల్, సుంకెట్ గ్రామాల్లో తహసీల్దార్ సత్యనారాయణ, వడ్యాట్, తిమ్మాపూర్ గ్రామాల్లో ఎంపీవో శ్రీధర్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. మోర్తాడ్ జీపీ కార్యాలయ ఆవరణలో ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. అనంతరం కార్యదర్శి రామకృష్ణ, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, ఆశవర్కర్లతో సిబ్బందితో సమావేశాన్ని నిర్వహించారు.