డిచ్పల్లి, మార్చి 12: తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి, 3వ, 5వ రెగ్యులర్ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను వైస్చాన్స్లర్ బుర్రా వెంకటేశం ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఆచార్య ఎం.యాదగిరి మంగళవారం విడుదల చేశారు. మొదటి సెమిస్టర్లో 8634 మందికి 2030 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. 3వ సెమిస్టర్లో 8147 మందికి 2613 మంది పాసయ్యారు. 5వ సెమిస్టర్ ఫలితాల్లో మొత్తం 9339 మందికి 3626 మంది ఉత్తీర్ణులయ్యారు.
అన్ని సెమిస్టర్లలో బాలికలదే పైచేయి సాధించారు. పారదర్శకంగా వేగవంతంగా ఫలితాలను అందించడంలో మార్గనిర్దేశనం చేసిన కంట్రోలర్ ఆచార్య అరుణ, అడిషనల్ కంట్రోలర్స్ డాక్టర్ నందిని, డాక్టర్ శాంతాబాయితోపాటు అసిస్టెంట్ రిజిస్ట్రార్ విజయలక్ష్మి, పరీక్షల విభాగం సిబ్బందిని రిజిస్ట్రార్ యాదగిరి అభినందించారు.