డిచ్పల్లి, జనవరి 30 : చారిత్రాత్మక నిలయమైన ఖిల్లా రామాలయ బ్రహ్మోత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని కోరుతూ ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సోమవారం ఆహ్వానపత్రికను అందజేశారు. జిల్లాకేంద్రంలోని కవిత నివాసంలో కలిసి కుటుంబసభ్యులతో ఉత్సవాలకు హాజరుకావాలని కోరారు. ఫిబ్రవరి 1 నుంచి 7వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహించనున్నట్లు రామాలయ కమిటీ చైర్మన్ పొద్దుటూరి మహేందర్రెడ్డి వివరించారు. కార్యక్రమంలో సర్పంచ్ గడ్డం రాధాకృష్ణారెడ్డి, ఉపసర్పంచ్ ఆసది రవీందర్, విండో చైర్మన్ గజవాడ జైపాల్, ఎంపీటీసీ కొత్తూరు మానససాయి, ఆలయ కమిటీ డైరెక్టర్లు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.
ఇందల్వాయి, జనవరి 30 : ఇందల్వాయి టోల్ప్లాజా వద్ద ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవన్రెడ్డికి బీఆర్ఎస్ మండల నాయకులు సోమవారం స్వాగతం పలికారు. మండలంలో అభివృద్ధి, సమస్యలను నాయకులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలువేరి గంగాదాస్, పార్టీ సీనియర్ నాయకుడు పాశం కుమార్, జాగృతి మండల అధ్యక్షుడు బొడ్డు గంగాధర్, నాయకులు కుంట రాంరెడ్డి, గణేశ్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.