కామారెడ్డి, మే 23: పాలిటెక్నిక్ కళాశాలలో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష(పాలిసెట్)కు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30 గం టల వరకు పరీక్ష నిర్వహించనున్నట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, పాలిసెట్ సమన్వయకర్త డాక్టర్ విజయ్కుమార్ గురువారం తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో నాలుగు సెంటర్లలో మొ త్తం 2,301 మంది విద్యార్థులు పరీక్ష రా యనున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని రెండు సెంటర్లలో 1200, సాందీపని డిగ్రీ కళాశాలలో 850, ఎస్ఆర్కే డిగ్రీ కళాశాలలో 251 మంది పరీక్ష రాయనున్నారని తెలిపారు. పరీక్ష ప్రారంభమైన తర్వాత నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించబోమని అన్నారు. కేంద్రానికి వచ్చే అభ్యర్థులు హాల్టికెట్పై ఫొటో ముద్రిం చి ఉండకపోతే పాస్పోర్ట్ సైజ్ ఫొటో, గుర్తిం పు కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్షాకేంద్రాన్ని పాలిసెట్ స్పెషల్ అబ్జర్వర్లు భరత్, హరికృష్ణ పరిశీలించారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. నిజామాబాద్ జిల్లాలో 16 పరీక్షా కేంద్రాల్లో 5,586 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకానున్నారని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్, సమన్వయకర్త ఫణిరాజ్ తెలిపారు.