డిచ్పల్లి, డిసెంబర్ 24 : జాతీయస్థాయి బేస్బాల్ పోటీలకు ఎంపికైన జిల్లా క్రీడాకారులు శనివారం బయల్దేరినట్లు బేస్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు లింగన్నగారి మధుసూదన్రెడ్డి, ప్రధానకార్యదర్శి కె.నరేందర్ తెలిపారు. ఈ నెల 15న సిద్దిపేట జిల్లా గజ్వేల్లో జరిగిన రాష్ట్రస్థాయి జూనియర్ బేస్బాల్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ చూపి జాతీయ స్థాయికి ఎంపికైనట్లు తెలిపారు. ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు కేరళ రాష్ట్రం కొల్లం జిల్లా కోతుగాంలోని లాల్ బహదూర్ శాస్ట్రి స్టేడియంలో నిర్వహించే 30వ జాతీయ జూనియర్ బేస్బాల్ పోటీలకు ఎంపికైనట్లు వివరించారు.
క్రీడాకారులను రాష్ట్ర వాలీబాల్ అసోసియేషన్ ప్రధానకార్యదర్శి ఎన్వీ హన్మంత్రెడ్డి, జిల్లా సాఫ్ట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.ప్రభాకర్రెడ్డి, ప్రధానకార్యదర్శి మార్కంటి గంగామోహన్, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు టి.విద్యాసాగర్రెడ్డి, ప్రధానకార్యదర్శి బొజ్జ మల్లేశ్గౌడ్, సాంఘిక సంక్షేమ విద్యాసంస్థల స్పోర్ట్స్ కో-ఆర్డినేటర్ పి.నీరజారెడ్డి, బేస్బాల్ సంఘం బాధ్యులు సోప్పరి వినోద్, వేముల మౌనిక, నల్లూరి లత, ఓస జ్యోత్స్న, స్వప్న, భాగ్య, నరేశ్, రంజిత్, అనిల్ అభినందించారు.
ఎంపికైన క్రీడాకారులు వీరే..
బాలికల విభాగంలో… రుతిక (సాంఘిక సంక్షేమ కళాశాల -సుద్దపల్లి), ప్రణీత (సాంఘిక సంక్షేమ కళాశాల -సుద్దపల్లి), ఇస్తారి రాణి (సాంఘిక సంక్షేమ కళాశాల -ధర్మారం), సింధు (సాంఘిక సంక్షేమ కళాశాల-ఆర్మూర్), బాలుర విభాగంలో.. ప్రజ్వల్ (సాంఘిక సంక్షేమ పాఠశాల – ఆర్మూర్).