నవీపేట, నవంబర్ 22: నూనతంగా ఏర్పాటు చేసిన బినోలా పీఎచ్సీలో ఓపీ సంఖ్య పెంచాలని డిప్యూటీ డీఎంహెచ్వో తుకారాం రాథోడ్ అన్నారు. మంగళవారం బినోలా పీహెచ్సీ, నవీపేట సీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రభుత్వ దవాఖానలో నెలకు కనీసం 10 ప్రసవాలు చేయాలన్నారు. గత నెలలో 5 డెలివరీలు మాత్రమే చేయడంపై వైద్య సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీపేట, బినోలా దవాఖానల్లో వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆదేశించారు. లేదంటే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆయన వెంట హెల్త్ సూపర్వైజర్లు కిషన్, దేవేందర్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ వెంకటేశ్వర్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.