బోధన్, ఏప్రిల్ 21: రెండేండ్ల కిందట కరోనా సంక్షోభంలో రద్దయిన బోధన్-మహబూబ్నగర్ ప్యాసింజర్ రైలును పునరుద్ధరిస్తున్నారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ ప్యాసింజర్ రైలును ఈ నెల 25 నుంచి ప్రారంభిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. కాగా, 2019 రద్దయిన బోధన్-నిజామాబాద్ ప్యాసింజర్ పునరుద్ధరణ విషయం లో రైల్వేశాఖ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ నెల 25 నుంచి పునరుద్ధరించనున్న బోధన్-మహబూబ్నగర్ ప్యాసింజర్ రైలు ఆ రోజు ఉదయం 4 గంటలకు కాచిగూడలో బయలుదేరి.. అదే రోజు రాత్రి 10.25 గంటలకు బోధన్కు చేరుకుంటుంది. బోధన్ నుంచి మరునాడు ఉదయం 5.20 గంటలకు బయలుదేరి కామారెడ్డి, కాచిగూడ, షాద్నగర్ల మీదుగా మధ్యాహ్నం 1.45 గంటలకు మహబూబ్నగర్ చేరుకుంటుంది. 25,26 తేదీల్లో ఈ రైలు ఈ సమయాల్లో నడిచినప్పటికీ, ప్రతిరోజూ నడుపుతారా.. లేదా నాలుగు రోజులకొకసారి నడుపుతారా అన్న విషయమై స్పష్టత లేదు.