కమ్మర్పల్లి, మార్చి 15 : రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి యువత, క్రీడాకారుల మనసెరిగిన నాయకుడు అని వివిధ జిల్లాల క్రీడాకారులు, యువకులు అన్నారు. క్రీడాకారులకు మంత్రి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారని, కమ్మర్పల్లిలో మినీస్టేడియం నిర్మాణమే ఇందుకు నిదర్శనమన్నారు. మంత్రి వేముల జన్మదిన వేడుకల్లో భాగంగా టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కమ్మర్పల్లిలోని మినీ స్టేడియంలో రెండు రోజులపాటు పురుషులు, మహిళల విభాగంలో వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించారు. ఈ టోర్నమెంట్ సోమవారం రాత్రి ముగిసింది. పురుషుల విభాగంలో పైనల్లో ఖమ్మం-వైజాగ్ జట్లు తలపడగా.. ఖమ్మం జట్టు గెలుపొందింది. విన్నర్ జట్టుకు రూ.25 వేల నగదు, రన్నర్ జట్టుకు రూ.15 వేల నగదు, తృతీయ స్థానంలో నిలిచిన హైదరాబాద్ జట్టుకు రూ.10 వేల నగదు బహుమతితోపాటు కప్ను నాయకులు అందజేశారు. మహిళల విభాగంలో విన్నర్గా నిలిచిన బాన్సువాడ జట్టుకు రూ.8 వేలు, రన్నర్గా నిలచిన కలిగోట్ జట్టుకు రూ.6 వేలు, తృతీయ స్థానంలో నిలిచిన మగ్గిడి జట్టుకు రూ.3 వేల నగదును అందజేశారు. జట్లకు బహుమతులను కమ్మర్పల్లి సర్పంచ్ గడ్డం స్వామి, ఎంపీటీసీ సభ్యుడు మైలారం సుధాకర్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు బద్దం చిన్నారెడ్డి, నాయకులు అజ్మత్ హుస్సేన్, లోలపు సుమన్, సుభాష్గౌడ్, బద్రి, టోర్నమెంట్ ఇన్చార్జి రుగ్వేద్, యూత్ విభాగం అధ్యక్షుడు కొత్తపల్లి రఘు, నవాబ్ పాషా, చింత గణేశ్, రాకేశ్, అక్షయ్ అందజేశారు. వాలీబాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్వీ హన్మంత్ రెడ్డి, ఎంపీపీ లోలపు గౌతమి, జడ్పీటీసీ సభ్యురాలు రాధ, కేబీఏ అధ్యక్షుడు లుక్క గంగాధర్, నాయకులు అహ్మద్ హుస్సేన్, ఫిజికల్ డైరెక్టర్ పవన్ కుమార్ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు.