నమస్తే తెలంగాణ యంత్రాంగం, మే 12: బోధన్లోని ప్రభుత్వ దవాఖానల్లో బుధవారం నిర్వహించిన కొవిడ్ పరీక్షలో 16 మందికి పాజిటివ్ వచ్చిందని ఆయా దవాఖానల వైద్యాధికారులు తెలిపారు. బోధన్లోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో 37 మందికి పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మంది కి, రాకాసీపేట్ అర్బన్హెల్త్ సెంటర్లో 22 మందికి పరీక్షలు నిర్వహించగా ఆరుగురికి, పాన్గల్లీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 30 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని వైద్యాధికారులు తెలిపారు. కాగా, పాజిటివ్ వచ్చిన వ్యక్తులకు హోం ఐసొలేషన్కు సూచించామని, మెడికల్ కిట్లు పంపిణీ చేయడంతోపాటు చేపట్టాల్సిన జాగ్రత్తల గురించి వివరించామని వైద్యసిబ్బంది తెలిపారు. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 34 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారి వెల్లడించారు. బోధన్ పట్టణంలోని జిల్లా ప్రభుత్వ దవాఖానలో బుధవారం 10 మందికి వ్యాక్సి న్ వేసినట్లు వ్యాక్సినేటర్ నిర్మల తెలిపారు. బోధన్ మండలం లోని సాలూరా పీహెచ్సీ పరిధిలో 11 మందికి కరోనా పాజి టివ్ వచ్చిందని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రేఖ తెలిపారు.
బుధవారం 61 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 11 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఆర్మూర్ ఏరియా దవాఖాన, పట్టణంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో, మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 25 మందికి పాజిటివ్ వచ్చిందని వైద్యు లు నాగరాజు, భాస్కర్రావు, ఆయేషా ఫిర్దోస్ తెలిపారు. ఆర్మూర్ ఏరియా దవాఖానలో 50 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 10 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. పట్టణం లోని హౌసింగ్ బోర్డులో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్లో 40 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని, మండలంలోని దేగాం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో 26 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13 మందికి కరోనా పాజిటివ్ వచ్చిందని హెల్త్ సూపర్వైజర్లు అర్గుల్ సుభాష్, చంద్రశేఖర్, అనురాధ, ఆరోగ్య కార్యకర్త మోహన్ తెలిపారు. రెంజల్ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కందకుర్తి సమీపంలోని చెక్పోస్టు వద్ద బుధవారం కొవిడ్ పరీక్షలు నిర్వహించగా ఎనిమిది మందికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారులు తెలిపారు.
భీమ్గల్ ప్రాథమిక ఆరో గ్య కేంద్రంలో 60 మందికి పరీక్షలు నిర్వహించగా 14 మందికి పాజిటివ్ వచ్చినట్ల్లు ప్రభుత్వ దవాఖాన వైద్యుడు అజయ్పవార్ తెలిపారు. మోర్తాడ్ పీహెచ్సీలో 53 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఏడుగురికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ రవికుమార్ తెలిపారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటిడోస్ తీసుకున్న వారు రెండో డోస్ కోసం 43 రోజుల తర్వాతే రావాలని సూచించారు. చౌట్పల్లి పీహెచ్సీలో 35 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ఐదుగురికి పాజిటివ్ వచ్చిందని డాక్టర్ రతన్సింగ్ తెలిపారు. వేల్పూర్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఆరుగురికి పాజిటివ్ వచ్చిందని మండల వైద్యాధికారి డాక్టర్ అశోక్ తెలిపారు. నందిపేట్ మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిర్వహించిన కరోనా పరీక్షల్లో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి అజయ్ తెలిపారు. మొత్తం 34 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్ వచ్చిందని, వారికి మెడికల్ కిట్లు అందజేయడంతోపాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించినట్లు వైద్యాధికారి పేర్కొన్నారు.
మాక్లూర్ మండలంలోని కల్లడి, మాక్లూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహించిన కరోనా టెస్టుల్లో 12 మందికి పాజిటి వ్ వచ్చినట్లు వైద్యులు సిఖిందర్నాయక్, సంజీవ్రెడ్డి తెలిపా రు. కల్లడిలో 12 మందికి టెస్టులు చేయగా తొమ్మిది మందికి, మాక్లూర్లో 23 మందికి టెస్టులు చేయగా ముగ్గురికి పాజిటి వ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ధర్పల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం 45 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఏడుగురికి పాజిటివ్ వచ్చినట్లు మండలప్రధాన వైద్యాధికారి డాక్టర్ రఘువీర్ తెలిపారు. డిచ్పల్లిలో ఒకటి, రామడుగులో రెండు, కోటాన్పల్లిలో ఒకటి, మద్దుల్ తండాతో ఒకటి, కేశారంలో ఒకటి, సీతాయిపేట్లో ఒకటి పాజిటివ్ కేసులు నమోదైనట్లు వివరించారు. పాజిటివ్ వచ్చిన వారికి మెడికల్ కిట్లను అందజేసినట్లు తెలిపారు. కోటగిరి మండలంలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు కృష్ణవేణి తెలిపారు.
పొతంగల్ పీహెచ్సీలో31 మందికి పరీక్షలు చేయగా ఇద్దరికి, కోటగిరి సీహెచ్సీలో 27 మందికి టెస్టు చేయగా నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని పేర్కొన్నారు. వర్ని కమ్యూనిటీ వైద్యశాలలో బుధవారం 32 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. తొమ్మిది మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి వెంకన్న తెలిపారు. 114 మందికి రెండో డోస్ వ్యాక్సిన్ వేసినట్లు పేర్కొన్నారు. రుద్రూర్ మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 30 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. నలుగురికి పాజిటివ్ వచ్చినట్లు డాక్టర్ దిలీప్ తెలిపారు. మోస్రా మండలకేంద్రంలో 19 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఇద్దరికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యాధికారి మధుసూదన్ తెలిపారు. జక్రాన్పల్లి మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం 40 మందికి కరో నా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. ఆరుగురికి పాజిటివ్ వచ్చినట్లు మండల వైద్యాధికారి రవీందర్ తెలిపారు. మండలంలో రెండో డోస్ టీకా వేశామన్నారు. జక్రాన్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో పంచాయతీ ఆధ్వర్యంలో సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. మోపాల్ మండలంలో ముగ్గురికి వ్యాక్సిన్ వేసినట్లు వైద్యుడు నవీన్ తెలిపారు. మండలకేంద్రంలో 46 మందికి పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు.