ధర్పల్లి/ నిజామాబాద్ రూరల్/కోటగిరి/చందూర్/రెంజల్/ఆర్మూర్, మే 7 : రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వం సరఫరా చేసిన రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లను తహసీల్దార్ జయంత్రెడ్డి ముస్లిములకు తహసీల్ కార్యాలయంలో శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్కుమార్, ఆర్ఐ రవి, సర్పంచ్ ఆర్మూర్ పెద్ద బాల్రాజ్, వార్డు సభ్యుడు ఇర్ఫాన్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ మండలంలోని మల్లా రంలో ముస్లిములకు సర్పంచ్ నగేశ్ దుస్తులను పంపిణీ చేశారు. కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో సర్పంచ్ ఇండ్లకు వెళ్లి గిఫ్ట్ ప్యాక్లను అందించారు. హంగర్గాఫారం పంచాయతీ ఆవరణలో ముస్లిములకు రంజాన్ కానుకలను సర్పంచ్ ఎజాజ్ఖాన్ పంపిణీ చేశారు.
కార్యక్రమంలో ఉపసర్పంచ్ దయాకర్రెడ్డి, సూరరెడ్డి, మైనార్టీ నాయకులు వలీయొద్దీన్, వార్డు సభ్యులు పాల్గొన్నారు. చందూర్ మండలకేంద్రంలో రంజాన్ కిట్లను తహసీల్దార్ వసంత ముస్లిములకు అందజేశారు. కార్యక్రమంలో అర్ఐ నజీర్, సర్పంచ్ సాయారెడ్డి, సొసైటీ చైర్మన్ మాధవరెడ్డి , మైమూద్, గౌస్ఖాన్, నబీ, మాజీద్, సలీం, రజాక్, అశ్వక్ తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండల కేంద్రంలోని ముస్లిములకు రంజాన్ తోఫాలను పంపిణీ చేసినట్లు సర్పంచ్ మార్ల రమేశ్కుమార్ తెలిపారు. ప్రభుత్వం సరఫరా చేసిన 145 గిఫ్ట్ప్యాక్లను అందజేశామని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మైనార్టీ విభాగం జిల్లా నాయకుడు రఫీయొద్దీన్, నాయకులు అంజయ్య, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.
ఆర్మూర్ మున్సిపల్ రెండో వార్డులో కౌన్సిలర్ ఖాందేశ్ సంగీత ముస్లిములకు రంజాన్ గిఫ్ట్ ప్యాకెట్లను శుక్రవారం పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన గిఫ్ట్ప్యాకెట్లను ఎమ్మెల్యే జీవన్రెడ్డి ఆదేశాల మేరకు పేద ముస్లిములకు అందజేస్తున్నామని తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు ఖాందేశ్ సత్యం, ప్రశాంత్, మునీర్, ఖలీం, జునైద్ తదితరులు పాల్గొన్నారు.