నిజామాబాద్ సిటీ: మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకోవాలని ట్రైనీ ఐఏఎస్ మకరందు అన్నారు. బుధవారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఇంజినీర్స్ డే ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన విశ్వేశ్వరయ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆయన మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు పట్టుదలతో చదివి ఉన్నతస్థాయికి ఎదగాలని సూచించారు. గౌరవ అతిథిగా హాజరైన మహేశ్ బిగాల మాట్లాడుతూ నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ఇంజినీరింగ్ చదివి విదేశాల్లో యూనివర్సిటీని
స్థాపించానని గుర్తుచేశారు.
అనంతరం తన తండ్రి పేరిట ఏర్పాటు చేసిన కృష్ణమూర్తి బిగాల ట్రస్ట్ నుంచి బ్రాంచ్ టాపర్ విద్యార్థులకు రూ.10వేలు, ఈసెట్ స్టేట్ టాపర్కు రూ.25 వేలు అందజేస్తానని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శ్రీరాంకుమార్, తదితరులు పాల్గొన్నారు.