నవీపేట/ రెంజల్/మెండోరా/ బాల్కొండ, డిసెంబర్ 20: రాష్ట్ర ప్రభుత్వం వచ్చే నెల జనవరి18 నుంచి రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నది. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం అవగాహన సదస్సులు నిర్వహించారు. కంటి వెలుగు కార్యక్ర మంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని అధికారులు సూచించారు. నవీపేట్ మండల పరిషత్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. కంటి వెలుగు పథకం పేదలకు వరం లాంటిదని పేరొన్నారు. 18ఏండ్లు పైబడిన ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో సయ్యద్ సాజీద్ అలీ, ఎంఈవో గణేశ్రావు, ఎంపీవో రామకృష్ణ, హెల్త్ కమ్యూనిటీ ఆఫీసర్ వెంకటేశ్వర్రావు,హెల్త్ సూపర్వైజర్ కిషన్, ఆయా గ్రామాలకు చెందిన కార్యదర్శులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో కంటి వెలుగుపై గ్రామ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ టీచర్లు, ఐకేపీ సిబ్బందికి అవగాహన కల్పించారు.
మండలంలో 18 సంవత్సరాలు పైబడిన వారు, కంటి సమస్యలు ఉన్న 30వేల మందిని గుర్తించినట్లు ఎంపీడీవో శంకర్ తెలిపారు. కంటి లోపం ఉన్న వారికి ఉచితంగానే అద్దాలను అందిస్తారన్నారు. కంటి వెలుగు కార్యక్రమంపై గ్రామాల్లో చాటింపు, అవగాహన కల్పించాలని ఆదేశించారు. సమావేశంలో హెల్త్ ఎడ్యుకేటర్ వెంకటేశ్వర్లు , వైద్యాధికారిణి ప్రమోదిత, మండల పర్యవేక్షకులు శ్రీనివాస్, ఆరోగ్య శాఖ అధికారులు శ్రావణ్కుమార్,రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
మెండోరా ప్రజాపరిషత్ కార్యాలయంలో కంటి వెలుగుపై సమావేశం నిర్వహించగా.. అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, డాక్టర్ చంద్రమోహన్, ఎంపీవో సాయిలు, సర్పంచులు మిస్బా, అనసూయ, మహేందర్, శ్రీనివాస్, అ ధికారులు భూమారెడ్డి, శ్యామ్, భోజన్న, విక్రమ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల పరిషత్ కార్యాలయంలోఎంపీడీవో సంతోష్కుమార్ ఆధ్వర్యంలో కంటి వెలుగు కార్యక్రమం సన్నాహక సభ నిర్వహించారు. కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. హెల్త్ ఆఫీసర్ పవన్ కుమార్, ఎంపీవో వెంకటేశ్వర్లు, హెల్త్ సూపర్వైజర్లు ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.