నందిపేట్, నవంబర్ 29: నందిపేట్ గౌడ సంఘ భవనానికి రూ. 50 లక్షలు, మారంపల్లి పద్మశాలి సంఘ భవనానికి రూ.10 లక్షలు మంజూరుచేస్తున్నట్లు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ప్రకటించారు. నందిపేట్ మండలానికి చెందిన గౌడ సంఘం ప్రతినిధులు, మండలంలోని మారంపల్లి పద్మశాలి సంఘ సభ్యులు మంగళవారం హైదరాబాద్లో ఎమ్మెల్యే జీవన్రెడ్డిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. తమ సంఘాల భవన నిర్మాణాలకు నిధులు మంజూరుచేయాలని కోరారు. స్పందించిన ఎమ్మెల్యే నందిపేట్ గౌడ సంఘం భవనానికి రూ.50లక్షలు, మారంపల్లి పద్మశాలి సంఘ భవనానికి రూ.10 లక్షల నిధులు మంజూరుచేస్తున్నట్లు ప్రకటించారు. తాము కోరగానే నిధులు మంజూరు చేసిన జీవన్రెడ్డికి వారు కృతజ్ఞతలు తెలిపారు.
జీవన్రెడ్డితో మైనార్టీ నేతల భేటీ
ఆర్మూర్కు చెందిన పలువురు మైనార్టీ పెద్దలు జీవన్రెడ్డితో సమావేశమయ్యారు. ఐదు నెలలుగా పెండింగ్లోఉన్న ఇమామ్ మౌజమ్ వేతనాలు చెల్లించినందుకు ఎమ్మెల్యేకు వారు ధన్యవాదాలు తెలిపారు. సమావేశంలో నందిపేట్ గౌడ సంఘం ప్రతినిధులు ఉల్లి శ్రీనివాస్గౌడ్, నాందేవ్గౌడ్, ప్రవీణ్గౌడ్, సుభాష్గౌడ్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.