నవీపేట, నవంబర్ 25: గెలుపోటములను సమానంగా తీసుకోవాలని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. మండలకేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం రాష్ట్ర స్థాయి 5వ సబ్ జూనియర్ నెట్బాల్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ టోర్నమెంట్కు రాష్ట్రంలోని 16 జిల్లాలకు చెందిన బాలుర విభాగంలో 16 జట్లు, బాలికల విభాగంలో 14 జట్లు పాల్గొంటున్నాయి. జడ్పీచైర్మన్ జ్యోతి ప్రజ్వలన చేసి టోర్నీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాకు చెందిన జాతీయ క్రీడాకారులు సౌందర్య, నిఖత్ జరీనా, మలావత్ పూర్ణను ఆదర్శంగా తీసుకొని నెట్బాల్ క్రీడలో జాతీయస్థాయిలో గుర్తింపు పొందేలా ప్రతి క్రీడాకారుడూ కృషిచేయాలన్నారు. విజయం సాధించిన క్రీడాకారులు పొంగిపోకుండా, ఓడిన వారు కృంగిపోకుండా ఆత్మ విస్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. నవీపేట క్రీడామైదాన అభివృద్ధికి జడ్పీ నిధులు రూ. 2 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. నవీపేట మండల కేంద్రంలో రాష్ట్ర స్థాయి నెట్బాల్ టోర్నమెంట్ను నిర్వహించడంపై నిర్వాహకుడు రవిని అభినందించారు.
సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్ బాడ్మిమెంట్లో జాతీయస్థాయి క్రీడాకారుడని తెలిపారు. క్రీడాకారులను జడ్పీ చైర్మన్ పరిచయం చేసుకున్నారు. అనంతరం టాస్ వేసి కమ్మం- నాగర్కర్నూల్ జట్ల మధ్య పోటీలను ప్రారంభించారు. టోర్నమెంట్ నిర్వహణకు సర్పంచ్ శ్రీనివాస్ రూ.11 వేలు, రోటరీ క్లబ్ జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి రూ.5 వేలను విరాళంగా ఇచ్చారు.
కార్యక్రమంలో ఎంపీపీ సంగెం శ్రీనివాస్, సర్పంచ్ ఏటీఎస్ శ్రీనివాస్, వైస్ ఎంపీపీ ఇందూర్ హరీశ్, ఒలింపియా సంఘం జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి నర్సయ్య, ఎస్సై రాజారెడ్డి, నవీపేట విండో అధ్యక్షుడు న్యాలకంటి అబ్బన్న, జిల్లా యువజన క్రీడల అధికారి ముత్యన్న, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు మోహన్రెడ్డి, రోటరీ క్లబ్ అధ్యక్షుడు శ్రీధర్రెడ్డి, ఎంఈవో గణేశ్రావు, ఎంపీటీసీ మీనా నవీన్రాజ్, వ్యాఖ్యాత రాధ, నవీపేట జడ్పీ హైస్కూల్ ఇన్చార్జి హెచ్ఎం సురేఖ, బాలికల పాఠశాల హెచ్ఎం అరుణ, టోర్నీ నిర్వాహకుడు, ఫిజికల్ డైరెక్టర్ రవి, ఎంపీడీవో సయ్యద్ సాజిద్ అలీ, తాహెర్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ నవీన్కుమార్, సంజీవ్, పీడీలు పాల్గొన్నారు.