కోటగిరి/మోస్రా(చందూర్)/భీమ్గల్/బోధన్ రూరల్/ఖలీల్వాడి, అక్టోబర్ 1 : గిరిజనులకు రిజర్వేషన్ను ఆరు నుంచి పది శాతానికి పెంచడంపై గిరిజనులు హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారని కొనియాడుతూ ఆయన చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
కోటగిరి మండలకేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు గిరిజనులు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో గిరిజనులు మాధవ్రావు, తుకారాంనాయక్, ఫకీరానాయక్, వివేక్, భీమానాయక్, దేవీసింగ్, రాములు నాయక్, జడ్పీటీసీ సభ్యుడు శంకర్పటేల్, టీఆర్ఎస్ నాయకుడు వల్లెపల్లి శ్రీనివాసరావు, మండల కన్వీనర్ ఎజాజ్ఖాన్ పాల్గొన్నారు.
మోస్రా మండల కేంద్రంలో సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు బంజారా సేవాసంఘం ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో బంజారా సేవా సంఘం అధ్యక్షుడు బాదావత్ మురళీకృష్ణానాయక్, ధర్మానాయక్, శివ, గోవర్ధన్, సతీశ్, సురేశ్, వినోద్, రమేశ్ పాల్గొన్నారు.
భీమ్గల్ మండలకేంద్రంలో రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శర్మానాయక్, కౌన్సిలర్ ధరావత్ లింగయ్య, సర్పంచులు ఎంజీ నాయక్, తిరుపతి నాయక్, నియోజకవర్గ సమన్వయ సమితి సభ్యుడు తుక్కాజీ నాయక్, బంజారా ఉద్యోగ సంఘం నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
బోధన్ మండలం ఊట్పల్లిలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ వినోద్నాయక్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే షకీల్ చిత్రపటాలకు గిరిజనులు క్షీరాభిషేకం చేశారు. బంజారా నాయకులు ప్రభాకర్, మోతీరాం, శంకర్, శ్రీను, రాజు, విజయ్, చందర్నాయక్ పాల్గొన్నారు.
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు చందూ నాయక్ సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటారని మరొకసారి రుజువు చేశారన్నారు.
గౌడ కార్మికుల ఆధ్వర్యంలో..
డిచ్పల్లి, అక్టోబర్ 1 : మండలంలోని కొరట్పల్లిలో తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి గౌడ సంఘం సభ్యులు, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు క్షీరాభిషేకం చేశారు. గౌడ సంఘం లైసెన్సు రెన్యువల్ ప్రక్రియను ఐదేండ్ల నుంచి పదేండ్లకు పొడిగిస్తూ జీవో జారీ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ నీరడి శ్రీజ, ఉపసర్పంచ్ నవీన్రెడ్డి, టీఆర్ఎస్వీ రూరల్ కన్వీనర్ చిరంజీవి, ఆశన్న, వార్డుమెంబర్లు గంగాధర్, బైని ప్రభాకర్ గౌడ్, సంఘం అధ్యక్షుడు పార్వతీ రాజు, గౌడ సంఘం నాయకుడు గుర్రపు గంగారాం, మాజీ సర్పంచ్ లక్ష్మీనారాయణగౌడ్, సభ్యులు పాల్గొన్నారు.