బాల్కొండ, సెప్టెంబర్ 30 : రైతుబీమాతో అన్నదాతల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ధీమా కల్పించిందని ప్రజాప్రతినిధులు, నాయకులు అన్నారు. మండలకేంద్రానికి చెందిన చిన్న మల్లయ్య, దేవేందర్, చిట్టాపూర్ గ్రామానికి చెందిన చిన్న గంగాధర్ వివిధ కారణాలతో మృతిచెందగా, బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున రైతుబీమా మంజూరైంది. సంబంధిత చెక్కులను మండలకేంద్రంలోని రైతువేదికలో ఎంపీపీ లావణ్యా లింగాగౌడ్, జడ్పీటీసీ దాసరి లావణ్యా వెంకటేశ్, ఏవో మహేందర్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచులు సునీత, వనజా గోవర్ధన్గౌడ్, ఎంపీటీసీలు లింగవ్వాపోశెట్టి, వేల్పూర్ ఏఎంసీ డైరెక్టర్ సయ్యద్ మజారుద్దీన్, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ రాజేశ్వర్, సొసైటీ వైస్చైర్మన్ పెద్ద బాల్రాజేశ్వర్, ఉపసర్పంచులు షేక్ వాహబ్, రాజేందర్, టీఆర్ఎస్ మండల ప్రధానకార్యదర్శి విద్యాసాగర్, చిట్టాపూర్ గ్రామశాఖ అధ్యక్షుడు సాయన్న, జీపీ కార్యదర్శి నర్సయ్య, ఏఈవో, నాయకులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత..
వేల్పూర్ మండలంలోని అమీనాపూర్కు చెందిన పలువురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. వాటిని లబ్ధిదారులకు సర్పంచ్ రాజేశ్వర్ శుక్రవారం అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గంగామణి, ఉపసర్పంచ్, టీఆర్ఎస్ నాయకులు, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు. ఏర్గట్ల మండలంలోని భట్టాపూర్కు చెందిన లావణ్య, లక్ష్మణ్, శ్రీనివాస్, తొర్తి గ్రామానికి చెందిన నర్సు, నర్సయ్య, రమ్య, తాళ్లరాంపూర్కు చెందిన కవిత, దేవేందర్, ముత్తెమ్మ, తడ్పాకల్కు చెందిన రజిత, భాజమ్మ, ఏర్గట్లకు చెందిన లత, గుమ్మిర్యాల్కు చెందిన సురేశ్, దోంచందకు చెందిన ముత్తెన్నకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయి. మండలకేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయం వద్ద ఎంపీపీ కొలిప్యాక ఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ రాజేశ్వర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజపూర్ణానందం చెక్కులను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు జక్కని మధుసూదన్, సర్పంచులు లావణ్యా గంగాధర్, ప్రకాశ్రెడ్డి, భానుప్రసాద్, పద్మ, రాధ, మండల కో-ఆప్షన్ సభ్యుడు అష్రాఫ్, మాజీ కో-ఆప్షన్ సభ్యుడు అజ్మత్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు లింగారెడ్డి, సొసైటీ చైర్మన్లు, వైస్ చైర్మన్లు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మోర్తాడ్ మండలకేంద్రానికి చెందిన 26 మంది లబ్ధిదారులకు రూ.10లక్షల 85వేల 600 విలువగల చెక్కులను స్థానిక ప్రజాప్రతినిధులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ శివలింగు శ్రీనివాస్ జడ్పీటీసీ రవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఏలియా, డీసీసీబీ డైరెక్టర్ భూమన్న, ఇంతియాజ్, సర్పంచ్ శ్రీనివాస్, ఎంపీటీసీలు, ఉపసర్పంచులు పాల్గొన్నారు. చెక్కుల మంజూరుకు సహకరించిన మంత్రి ప్రశాంత్రెడ్డికి లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. నవీపేట మండలం కోస్లీ గ్రామానికి చెందిన జ్యోతికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును సర్పంచ్ నీలేశ్కుమార్, వైస్ ఎంపీపీ హరీశ్ అందజేశారు. ఆర్థికసాయం మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యే షకీల్కు ధన్యవాదాలు తెలిపారు.