బాన్సువాడ, సెప్టెంబర్ 30 : కేంద్ర ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని చెప్పడంతోపాటు వ్యవసాయ రంగంలో కార్పొరేట్ వ్యవస్థను తెచ్చేందుకు ఆలోచన చేస్తోందన్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. సంక్షే మం, అభివృద్ధిలో దూసుకుపోతున్న తెలంగాణ రాష్ట్రంవైపు యావత్దేశం చూస్తోందన్నారు. శుక్రవారం ఆయన బీర్కూర్ మండల కేంద్రంలోని ఏఎంసీ కార్యాలయ ఆవరణలో రూ. 54 లక్షలతో చేపట్టనున్న సీసీ రోడ్డు, డ్రైనేజీ, ప్రహరీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఏర్పా టు చేసిన సమావేశంలో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో రైతుల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశంలోని వివధ రాష్ర్టాల్లో ఎందుకు అమలుచేయడంలేదని అక్కడి నాయకులను ప్రజలు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమాతో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయన్నారు. ధాన్యాన్ని పండించడంలో తెలంగాణ దేశంలోనే నంబర్ స్థానంలో ఉండగా.. రాష్ట్రంలో బాన్సువాడ నియోజకవర్గం ముందు వరుసలో ఉన్నదని తెలిపారు.
కొనుగోలు కేంద్రాలను తీసివేసే ఆలోచనలో కేంద్రం
రైతుల కోసం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను తీసివేసేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. వ్యవసాయ మోటర్లకు మీ టర్లు పెట్టి రైతులు వ్యవసాయం చేసుకోకుండా ఇబ్బందు లకు గురిచేస్తోందన్నారు. సీఎం కేసీఆర్ తన కంఠంలో ప్రాణం ఉండగా, మోటర్లకు మీట ర్లు పెట్టనివ్వబోమని చెప్పారని అన్నారు. ప్రకృతి వైపరీత్యాలు లేదా వరదల కారణంగా దేశంలో ఇబ్బందులు తలెత్తినా, కరువు సమయంలో ప్రజలకు ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత కేంద్రం పై ఉంటుందన్నారు. ఇందుకోసం 3 కోట్ల 55 లక్షల టన్నుల బియ్యం నిల్వ ఉంచాల్సి ఉంటుందని తెలిపారు. ఇది ఏ ప్రభుత్వం ఉన్నా చేయాల్సిన పని అన్నారు. ప్రజల కడుపు నిండాలంటే రైతులు పంటలు పండించాలని, పండించిన ధాన్యాన్ని ప్రభుత్వాలు సొసైటీ, ఏఎంసీలు లేదా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలన్నారు. రైతుల సంక్షేమం కోసమే సీఎం కేసీఆర్ ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు.
రైతులు లాభాలు వచ్చే పంటలను సాగుచేయాలి
రైతులను లాభసాటి వ్యవసాయం వైపు మొగ్గు చూపేలా ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులు కేవలం వరి కాకుండా ఆయిల్ పాం వంటి పంటలను సాగుచేసి ఆదా యం పొందాలన్నారు. మన రాష్ర్టానికి ఆయిల్ను మలేషియా, ఇండోనేషియా తదితర దేశాల నుం చి దిగుమతి చేసుకుంటున్నామని తెలిపారు. రైతులు పంటలు వేసే ముందు వ్యవసాయాధికారులతో చర్చించి లాభం వచ్చే పంటలను వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ద్రోణవల్లి అశోక్, ఎంపీపీ రఘు, జడ్పీటీసీ స్వరూపా శ్రీనివాస్, మాజీ జడ్పీటీసీ ద్రోణవల్లి సతీశ్, కమ్మ సత్యనారాయణ, విండో చైర్మన్ గాంధీ, పెర్క శ్రీనివాస్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ సాయిలు యాదవ్, ఆవారి గంగారాం, ప్రభాకర్ రెడ్డి, కో -ఆప్షన్ సభ్యుడు మాజిద్, తహసీల్దార్ రాజు తదితరులు పాల్గొన్నారు.