బాన్సువాడ, సెప్టెంబర్ 30 : మంచి మనుషులు ఉన్న ఊర్లు బాగుంటాయని, పాడి పంటలు పుష్కలంగా పండుతాయని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. మంచి మనసుతో చేసే పనులకు దేవుడి ఆశీర్వాదం ఉంటుందన్నారు. శుక్రవారం ఆయన బీర్కూర్ మండలంలోని భైరాపూర్లో గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు గ్రామానికి చేరుకున్న ఆయనకు గ్రామస్తులు ద్విచక్రవాహనాల ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమ్మేళనంలో సభాపతి మాట్లాడుతూ.. అప్పుల బాధ నుంచి రైతు విముక్తి కావాలని, పంటలు పం డించి, వచ్చిన డబ్బులను బ్యాంకుల్లో దాచుకునే స్థాయికి ఎదగాలని సీఎం కేసీఆర్ ఆలోచన నుంచి పుట్టిన పథకాలే 24 గంటల ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా అని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆడబిడ్డలకు పెద్దన్నగా అక్కాచెల్లెళ్లకు బతుకమ్మ పండుగకు కానుకగా చీరెలను అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో బతుకమ్మ పండుగకు కోటి మంది ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలను అందిస్తున్నారని తెలిపారు. ప్రతి రైతు ఆరుగాలం శ్రమంచి పండించిన పంటతో వచ్చిన డబ్బులను తన అమ్మ లేదా భార్యకు ఇవ్వాలని సూచించారు. వృథా ఖర్చు చేయకుం డా దాచి ఇంటిని లక్ష్మీ నివాసంగా మార్చే శక్తి ఆడబిడ్డలకు ఉందన్నారు. అనంతరం గ్రామంలో ఇటీవల పేకాటకు బానిసై ఇద్దరు యువకులు అప్పు లు కట్టలేక మృతి చెందగా, వారి కుటుంబాలకు గ్రామస్తులందరూ సేకరించి ఇచ్చిన రెండు లక్ష రూపాయల చెక్కులను స్పీకర్ అందజేశారు. తాను కూడా రూ.50 వేల చొప్పున రెండు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తానని భరో సా ఇచ్చారు. అనంతరం కుల, యువజన సం ఘాల నాయకులు, మాజీ జడ్పీటీసీ సతీశ్ ఆధ్వర్యంలో స్పీకర్ పోచారం, డీసీసీబీ చైర్మన్ పో చారం భాస్కర్రెడ్డిని గజమాలతో సన్మానించారు.
కోలాటం ఆడిన స్పీకర్ పోచారం
బైరాపూర్ గ్రామంలోని విఠలేశ్వరాలయం వద్ద స్పీకర్ పోచారం మహిళలతో కలిసి బతుకమ్మ , కోలాటం ఆడారు. మండలంలో పేకాట జోరుగా సాగుతోందని, దీంతో యువకులు బానిసవుతున్నారని కట్టడి చేయాలని స్పీకర్ దృష్టికి గ్రామస్తులు ఈ సందర్భంగా తీసుకెళ్లారు. స్పందించిన స్పీకర్ వెంటనే రూరల్ సీఐ మురళితో మాట్లాడారు. పేకాట ఆడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పేకాట అంటే వణికిపోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అంజవ్వ, ఎంపీటీసీ లక్ష్మి , జడ్పీటీసీ స్వరూపా శ్రీనివాస్, ఎంపీపీ రఘు, ఎంపీటీసీ రఘు, పీఏసీఎస్ చైర్మన్ రామకృష్ణగౌడ్, వైస్ చైర్మన్ శ్యాం, కో -ఆప్షన్ సభ్యుడు ఆరిఫ్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు సాయిలు, రైతుబంధు సమితి కన్వీనర్ హన్మంత్ రావ్ తదితరులు పాల్గొన్నారు.