ఖలీల్వాడి / బోధన్, సెప్టెంబర్ 5: నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నూతన సమీకృత కలెక్టరేట్ను రూ. 58 కోట్లతో నిర్మించి జిల్లా ప్రజలకు సీఎం కేసీఆర్ అంకితం చేయడం గర్వించదగ్గ విషయమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సోమవారం నిజామాబాద్ కలెక్టరేట్ను ప్రారంభించిన అనంతరం గిరిరాజ్ కళాశాల మైదానంలో సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలోమంత్రి వేముల మాట్లాడుతూ.. అన్ని హం గులతో కూడిన నూతన కలెక్టరేట్ను ఇవ్వడంతో పాటు టీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవనాన్ని ఇచ్చి వాటిని సీఎం కేసీఆర్ ప్రారంభించడంపై హ ర్షం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ నాయకత్వానికి మద్దతు తెలిపేందుకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారన్నారు.
కేసీఆర్ పాలనలోనే సకల జనుల సంక్షేమం : ఎమ్మెల్యే జీవన్రెడ్డి
సకల జనులకు.. పుట్టిన పిల్లలు మొదలు వృద్ధుల వరకు అనేక సంక్షేమ పథకాలను సీఎం కేసీఆర్ విజయవంతంగా అమలుచేస్తున్నారని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ సభలో ఆయన స్వాగతోపన్యాసం ఇచ్చారు. రూ.600 పింఛన్ మాత్రమే ఇచ్చే గుజరాత్ మోదీ పాలన కావాలా..? రూ.2,016 పింఛన్ ఇస్తున్న కేసీఆర్ పాలన కావాలా? అం టూ సభలోని ప్రజలను అడిగారు. సభికుల నుంచి ‘కేసీఆర్ పాలనే కావాలి..’ అంటూ పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. గుజరాత్ గులాముల పాలనను సహించేదిలేదని, తెలంగాణ పాలననే ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. అనేక సంక్షేమ పథకా లను అమలుచేస్తున్న కేసీఆర్ను దేశ్ కీ నేతగా చూడాలని కోరుకుంటున్నారన్నారు.
కొత్త కలెక్టరేట్ ఏర్పాటు హర్షణీయం: అర్బన్ ఎమ్మెల్యే బిగాల
నిజామాబాద్ పాత జిల్లా అయినప్పటికీ, జిల్లాపై ఉన్న ప్రేమతో కొత్త కలెక్టరేట్ భవనాన్ని నిర్మించి ఇవ్వడం హర్షణీయమని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 38 లక్షల మందికి పింఛన్లు వస్తుండగా, మరో 10 లక్షల పింఛన్లను కేసీఆర్ మంజూరుచేశారన్నారు. కేసీఆర్ నాయకత్వాన్ని బలపర్చేందుకు ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారని తెలిపారు.