శ్రీరాంసాగర్ ప్రాజెక్టు జల సిరులతోపాటు దండిగా విద్యుత్ వెలుగులను పంచుతున్నది. ఇక్కడి జల విద్యుదుత్పత్తి కేంద్రంలో నిరంతరాయంగా కరెంట్ ఉత్పత్తి అవుతున్నది. పవర్ జనరేషన్లో కొత్త రికార్డులు నమోదు చేస్తున్నది. మూడేండ్లుగా కాలం కలిసి రావడంతో ఎస్సారెస్పీకి వరదలు పోటెత్తాయి. దీంతో కాకతీయ కాలువ/ఎస్కేప్ కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తూ నిరంతరాయంగా పవర్ జనరేట్ చేస్తున్నారు. ఏటా ఎస్సారెస్పీ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 75 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేయాలన్నది లక్ష్యం కాగా, రెండేండ్లుగా అంతకు మించి ఉత్పత్తి చేశారు. గతేడాది రికార్డు స్థాయిలో 109 మి.యూ. విద్యుత్ ఉత్పత్తి అయ్యింది. ఈ సంవత్సరం ఇప్పటికే 38.1288 మి.యూ. కరెంట్ ఉత్పత్తి జరిగింది. ఈసారి కూడా లక్ష్యానికి మించి పవర్ జనరేట్ అయ్యే అవకాశముందని అధికారులు చెబు్నారు.
– కమ్మర్పల్లి, ఆగస్టు 24
ఎస్సారెస్పీ జెన్కోలో విద్యుత్ ఉత్పత్తి ఆశాజనకంగా జరుగుతూ వస్తున్నది. ఎస్సారెస్పీ వెలవెలబోయిన సందర్భాల్లో స్వల్ప ఉత్పత్తికే కష్టమైన సందర్భాలున్న ప్రాజెక్టు చరిత్రలో మూడు సంవత్సరాలుగా లక్ష్యానికి అనుగుణంగా ఉత్పత్తి జరుగుతూవస్తున్నది. వరుసగా మూడు వానకాలాల్లో ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో ఉత్పత్తి జోరుగా సాగుతూ వస్తున్నది. ఫలితంగా శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు సాగు నీటిని అందిస్తుండడమే కాకుండా వరద వెల్లువ దన్నుగా విద్యుత్ వెలుగులనూ పంచుతున్నది.ఈ క్రమంలో ఈ 2022-23 ఆర్థిక సంవత్సరంలోనూ ఎస్సారెస్పీ జెన్కోలో లక్ష్యం దిశగా విద్యుదుత్పత్తి జరుగుతున్నది.
ఒక్కో టర్బయిన్ నుంచి 9 మెగావాట్లు..
ఎస్సారెస్పీకి వర్షాభావ పరిస్థితులతో వెలవెలబోయిన సీజన్లతోపాటు నిండుకుండల్లా కళకళలాడిన సందర్భాలూ, సీజన్లూ ఉన్నాయి. వానకాలం మొదలు.. పూర్తయ్యే వరకు కొనసాగుతూనే ఉండే వరదలతో ప్రాజెక్టు నిండిన సందర్భాల్లో జరిగే విద్యుదుత్పత్తిలో వేగం కన్నా వరద ఉధృతి జోరుగా ఉండి వచ్చే ఇన్ఫ్లోల సమయంలో ఉత్పత్తి వేగం కొంచెం ఎక్కువగా ఉంటుంది. మూడేండ్లుగా ప్రాజెక్టును ఇలాంటి వరద ఉధృతితో కూడిన ఇన్ఫ్లోలే నింపేశాయి. వానకాలం ప్రథమార్థంలోనే ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నింపేస్తూ ఇన్ఫ్లోలు వచ్చాయి. దీంతో మూడేండ్లుగా వానకాలం ఆరంభ మాసాల్లోనే విద్యుదుత్పత్తి ఆశాజనకంగా ప్రారంభమవుతున్నది. ఎస్సారెస్పీలో నాలుగు టర్బయిన్ల ద్వారా విద్యుదుత్పత్తి జరుగుతున్నది. ఒక్కో టర్బయిన్ ద్వారా 2,200 క్యూసెక్కుల వరదను పంపడంతో 9 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. వరద ఉధృతి తీవ్రంగా ఉన్నప్పుడు 9.7 మెగావాట్ల వరకు ఉత్పత్తి జరుగుతుంది.
లక్ష్యానికి మించి..
ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండితే సాధారణంగా 75మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తికి అవకాశం ఉంటుంది. 2020-21లో ప్రాజెక్టు నిండడం, వరద ఉధృతితో 90.7658 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. 2021-22లో ఉధృతితోకూడిన వరదలతో ప్రాజెక్టు నిండింది. ఈ 2021-22 సీజన్లో 678 టీఎంసీల ఇన్ఫ్లో, 676 అవుట్ఫ్లో నమోదయ్యాయి. ఈ ఉధృత ఇన్ఫ్లోలు, యాసంగిలో పంటలకు కాకతీయ కాలువ ద్వారా నీటి విడుదల, ఎస్కేప్ గేట్ల ద్వారా నీటి విడుదలతో ఏకంగా 109.8417 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. గడిచిన పదేండ్లలో ఉత్పత్తి వివరాలను పరిశీలిస్తే 2021-22 సీజన్లో అత్యధికంగా లక్ష్యానికి మించి ఉత్పత్తి జరిగింది.
ఈ పదేండ్లలో 2012-13లో కేవలం 16.3455, 2013-14లో 85.0525, 2014-15లో 12.8769 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. 2015-16లో ప్రాజెక్టు వెలవెలబోవడంతో విద్యుదుత్పత్తే
జరుగలేదు. 2016-17లో 75.3555, 2017-18లో 35.6332, 2018-19లో 31.6374, 2019-20లో 48.6817 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. తాజా 2022-23 సీజన్కు
సంబంధించి ఏప్రిల్లో ఉత్పత్తి ప్రారంభమైంది. తొలిసారిగా విద్యుత్ ఉత్పత్తికి జూలైలోనే నీటిని వదిలారు. ఈ జూలై, ఆగస్టు మాసాల్లో ప్రాజెక్టుకు జోరుగా వరద కొనసాగింది. దీంతో జూలైలో 12.8756 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. ఈ రోజు వరకు 38.1288 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. ప్రాజెక్టు ఇప్పటికే పూర్తిస్థాయిలో నిండుగా ఉండడం.. మరో రెండు నెలలు వర్షాలకు అవకాశం ఉండడంతో ఈసారి సైతం 75మిలియన్ యూనిట్ల లక్ష్యానికి మించి విద్యుత్ ఉత్పత్తి జరిగే అవకాశం ఉన్నది.
ఆకట్టుకునే డిజైన్లు..
బతుకమ్మ చీరలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని పంపిణీ చేస్తున్నది. చీరల తయారీలో ఎక్కడా రాజీపడడం లేదు. రూ.కోట్లు వెచ్చించి నాణ్యమైన చీరలను తయారు చేసేలా ఏడాది పొడవునా ఏర్పాట్లు చేస్తున్నది. ఓవైపు చేనేత కార్మికులకు ప్రభుత్వం చేతి నిండా పని కల్పిస్తున్నది. మరోవైపు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయానికి ప్రతిబింబమైన బతుకమ్మ పండుగ కానుకగా చీరలను మహిళలకు అందిస్తున్నది. వచ్చే నెల 17నుంచి వీటిని అన్ని గ్రామాలు, వార్డుల్లో లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా 1.10కోట్ల చీరలను ఈ నెల 22 నుంచి జిల్లాలకు చేరవేసేందుకు రాష్ట్ర చేనేత సహకార సంస్థ సన్నాహకాలు ప్రారంభించింది. పాత డిజైన్లకు తోడు ఈసారి కొత్తగా 17 రంగులు, 17డిజైన్లతో కలిపి బతుకమ్మ చీరలను రూపొందించారు. ఈసారి చీరలకు డాబీ అంచు ఉండడం ప్రత్యేకతను సంతరించుకుంటున్నది. సిద్ధమైన వాటిని ఈ నెల నాలుగో వారం నుంచి జిల్లాలకు సరఫరా చేస్తారు. వచ్చే నెల 25నుంచి బతుకమ్మ
పండుగ ఉంది. అంతకన్నా నాలుగు రోజుల ముందే పంపిణీ పూర్తిచేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. రాష్ట్ర వ్యాప్తంగా రేషన్షాపుల్లో పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయబోతున్నారు.
ఆశాజనక ఉత్పత్తి సంతోషకరం
ఎస్సారెస్పీ జెన్కోలో మూడేండ్లుగా విద్యుదుత్పత్తి జోరుగా సాగుతుండడం సంతోషంగా ఉంది. వరుసగా మూడు సీజన్లలో ప్రాజెక్టు నిండుకుండలా ఉంటున్నది. దీంతో విద్యుదుత్పత్తి లక్ష్యం మేరకు, లక్ష్యానికి మించి జరుగుతున్నది. ఈ వరద, నీటి లభ్యత అవకాశాన్ని ఉత్పత్తికి సద్వినియోగం చేస్తూ సిబ్బంది పని చేస్తున్నారు. ఈసారి లక్ష్యం దిశగా ఉత్పత్తి జరుగుతున్నది.
– శ్రీనివాస్, డివిజనల్ ఈఈ, ఎస్సారెస్పీ జెన్కో