బాన్సువాడ టౌన్/బాన్సువాడ రూరల్/బీర్కూర్/నస్రుల్లాబాద్/కామారెడ్డి రూరల్/నిజాంసాగర్/రామారెడి, జూన్ 29 : రైతుబంధు పథకం ద్వారా పంటలసాగుకోసం పెట్టుబడి సహాయం బ్యాంకు ఖాతాల్లో జమవుతుండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు జిల్లా వ్యాప్తంగా బుధవారం క్షీరాభిషేకాలు చేశారు.
రైతుబంధు జిల్లా కో-ఆర్డినేటర్ దుద్దాల అంజిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ మోహన్నాయక్ ఆధ్వర్యంలో బాన్సువాడ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఎంపీపీ దోడ్ల నీరజావెంకట్రాంరెడ్డి, సొసైటీ చైర్మన్ ఏర్వాల కృష్ణారెడ్డి, బుడ్మి సొసైటీ చైర్మన్ పిట్ల శ్రీధర్, మాజీ ఎంపీపీ ఏజాస్, సీనియర్ నాయకులు వెంకట్రాంరెడ్డి, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నారాయణరెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు రుక్మిణి, వెంకటేశ్, రవీందర్రెడ్డి, శ్రీనివాస్, హకీం, కిరణ్కుమార్, బిట్ల రమేశ్, మండల యూత్ అధ్యక్షుడు ప్రశాంత్, జేకే తండా సర్పంచ్ సంగ్రామ్నాయక్, నాయకులు పోతురెడ్డి, వహాబ్, మట్ట సాయిలు, దాసరి శ్రీనివాస్, సోమేశ్వర్, మెగులయ్య, విఠల్రెడ్డి, ఇలియాస్, రహీం, పీర్సింగ్, రాజశేఖర్, వడ్ల శివ, లాయక్ తదితరులు పాల్గ్గొన్నారు.
బాన్సువాడ మండలం తాడ్కోల్లో ప్రజాప్రతినిధులు, రైతులు సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఎస్ఎంసీ చైర్మన్ కుమ్మరి రాజు, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు లక్ష్మాగౌడ్, మాజీ సర్పంచ్ గంగుల గంగారాం, నాయకులు వెంకట్రెడ్డి, జనార్దన్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బీర్కూర్ మండల కేంద్రంలోని గాంధీచౌక్లో రైతుబంధు సమితి గ్రామ అధ్యక్షుడు అవారి గంగారాం ఆధ్వర్యంలో సీఎం, స్పీకర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఎంపీపీ తిలకేశ్వరి రఘు, ఎంపీటీసీ సందీప్పటేల్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లాడేగాం వీరేశం, గ్రామ శాఖ అధ్యక్షుడు దుంపల రాజు, ప్రధానకార్యదర్శి కొరిమె రఘు, నాయకులు లాడేగాం గంగాధర్, మన్నాన్, నర్రా సాయిలు, యాట వారేశం, గుడికొండ లింగం, గట్క వేరేశం, బస్వరాజ్ తదితరులు పాల్గొన్నారు.
నస్రుల్లాబాద్ మండల కేంద్రంలోని రైతువేదిక భవనం ఆవరణలో సీఎం కేసీఆర్, స్పీకర్ పోచారం చిత్రపటాలకు రైతులు, నాయకులతో కలిసి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెర్క శ్రీనివాస్ క్షీరాభిషేకం చేశారు. రైతుబంధు సమితి అధ్యక్షుడు సాయిలు యాదవ్, వైస్ ఎంపీపీ, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బాలకృష్ణ, నాయకులు కంది మల్లేశ్, లక్ష్మీనారాయణ, మైశాగౌడ్, వీరారెడ్డి, పందిరి భుమేశ్, ఇమ్రాన్, ఫకీరా, భీమ్రావు, రాములు తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డ్డి మండలం క్యాసంపల్లికి చెందిన రైతులు పంటపొలాల్లో తమ పట్టాపాస్పుస్తకాలను చూపుతు ఆనందం వ్యక్తం చేశారు. నిజాంసాగర్ మండలంలోని గోర్గల్ గ్రామంలో పొలంలో నాట్లు వేస్తున్న కూలీలు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దుర్గారెడ్డి, వైస్ ఎంపీపీ మనోహర్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు రమేశ్గౌడ్, గోర్గల్, మాగి సర్పంచులు అంబవ్వ, కమ్మరికత్త అంజయ్య, నాయకులు శ్రీకాంత్రెడ్డి, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పర్వారెడ్డి ఆధ్వర్యంలో రైతుబంధు సమితి మండల కన్వీనర్ గురజాల నారాయణరెడ్డి, సర్పంచ్ గంగారాం తదితరులు సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. మరోసారి కేసీఆర్ను ఆశీర్వదించాలని రైతులను కోరారు. కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ సరస్వతి, వీడీసీ అధ్యక్షుడు పల్లె నర్సింహులు, పురం లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.