ఆర్మూర్/భీమ్గల్/వేల్పూర్/కమ్మర్పల్లి, మే 20 : పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పలువురు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను కౌన్సిలర్లు తాటి హన్మాండ్లు, జనార్దన్రాజ్ శుక్రవారం పంపిణీ చేశారు. 35వ వార్డులో వార్డు టీఆర్ఎస్ ఇన్చార్జి సడక్ వినోద్, 11వ వార్డులో కౌన్సిలర్ తలారి మీనాచందు, 5వ వార్డులో కౌన్సిలర్ బండారి ప్రసాద్లు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. 19వ వార్డుకు చెందిన ఓ లబ్ధిదారుకు కల్యాణలక్ష్మి చెక్కును టీఆర్ఎస్ నాయకులు దమ్మన్నస్వామి, జన్నేపల్లి రంజిత్, వార్డు టీఆర్ఎస్ మహిళా అధ్యక్షురాలు రాజశ్రీ అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్ఎస్ నాయకులు భీమాగౌడ్, ముకుంద్ గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
భీమ్గల్ మండలంలోని పలు గ్రామాలకు చెందిన 25 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎంపీపీ ఆర్మూర్ మహేశ్, జడ్పీటీసీ రవి పంపిణీ చేశారు. ఎంపీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సయ్య, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు మొయీజ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు శర్మానాయక్, సర్పంచులు, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
వేల్పూర్ మండలకేంద్రానికి చెందిన ఇద్దరికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, సర్పంచ్ తీగల రాధ, ఉప సర్పంచ్ పిట్ల సత్యం, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పత్రాప్, ఆత్మ కమిటీ చైర్మన్ నోముల రవీందర్, గ్రామ కార్యదర్శి వినోద్, టీఆర్ఎస్ నాయకులు ప్రవీణ్, వెంకటేశ్గౌడ్, కుర్మ గంగాధర్, చాకలి దేవేందర్, కార్తీక్, సౌడ దాసు, బద్దం హరికిషన్, గ్రామ కమిటీ అధ్యక్షుడు మోహన్ దాసు, పట్కరి అశోక్ పాల్గొన్నారు.
కమ్మర్పల్లి మండలంలోని ఐదుగురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు తెడ్డు కిరీటి, ఆరెల్లి నవీన్ గౌడ్, సర్పంచ్ మారు శంకర్, ఎంపీటీసీ ఏశాల నర్సయ్య, రైతుబందు సమితి గ్రామ కో-ఆర్డినేటర్లు నోముల నరేందర్, విండో చైర్మన్ కంట ప్రతాప్రెడ్డి, కిరణ్, జంగం మహేశ్, శంకర్, రాజేందర్రెడ్డి, నర్సాగౌడ్, రాముగౌడ్, మోహన్, మురళి, పురుషోత్తం పాల్గొన్నారు.