కమ్మర్పల్లి/బోధన్ రూరల్/ రెంజల్/ మెండోరా/ భీమ్గల్/ మాక్లూర్, మే 19: రైతులు మోతాదుకు మించి యూరియాను వాడొద్దని జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్ సూచించారు. కమ్మర్పల్లి మండలంలోని కమ్మర్పల్లి, హాసాకొత్తూర్లో వానకాలం పంటల సాగుపై గురువారం నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అవసరం మేరకు దఫాల వారీగా యూరియాను వాడితేనే దిగుబడి పెరుగుతుందని తెలిపారు. కంది పంటకు ప్రస్తుతం డిమాండ్ ఉన్నదని, సాగుచేయాలని సూచించారు. భీమ్గల్ ఏడీఏ కె.మల్లయ్య, సర్పంచులు గడ్డం స్వామి, ఏనుగు పద్మ, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ బద్దం రాజేశ్వర్, ఏఈవోలు రవి, రమేశ్, నిఖిల్ పాల్గొన్నారు.
రెంజల్ మండలంలోని దండిగుట్ట, నీలా, రెంజల్ , కళ్యాపూర్ గ్రామాల్లో ఏవో శ్రీనివాస్రావు ఆధ్వర్యంలో వానకాలం పంటల సాగుపై అవగాహన సదస్సులను నిర్వహించారు. ఎంపీడీవో శంకర్, సర్పంచులు శ్రీదేవి, లలితా రాఘవేందర్, రమేశ్కుమార్, నిరంజనీ సాయిలు తదితరులు పాల్గొన్నారు. బోధన్ మండలంలోని ఊట్పల్లి గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణగుప్తా, ఏఈవో గంగజాల తదితరులు పాల్గొన్నారు. మెండోరా మండలంలోని ముప్కాల్, రెంజర్ల వానకాలం పంటలపై రైతులకు అవగాహన సదస్సులను మండల వ్యవసాయాధికారి రాజ్కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బద్దం నర్సవ్వ నర్సారెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ ప్రతాప్రెడ్డి, రెంజర్ల ఉపసర్పంచ్ మోహన్రెడ్డి, ఏఈవోలు నిషీకాంత్, సంధ్య, సొసైటీ డైరెక్టర్లు, రైతులు పాల్గొన్నారు.
భీమ్గల్ మండలంలోని బాబానగర్ గ్రామంలో ఏవో భార్గవ్ ఆధ్వర్యంలో, మాక్లూర్ మండలంలోని మాక్లూర్, మదన్పల్లి, ధర్మోరా, మాందాపూర్, గుత్ప, గుత్ప తండా, లక్మాపూర్ గ్రామాల్లో ఏవో పద్మ అవగాహన కల్పించారు. సర్పంచులు అశోక్రావు, శంకర్గౌడ్, కో-ఆప్షన్ సభ్యుడు హైమద్, ఏఈవో రంజిత్ పాల్గొన్నారు.