మోర్తాడ్/ఆర్మూర్/కమ్మర్పల్లి/నవీపేట/బాల్కొండ, మే 19 : అనారోగ్యం పాలై ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందుతున్న వారికి సీఎంఆర్ఎఫ్ ఆదుకుంటున్నదని మోర్తాడ్ ఎంపీపీ శివలింగు శ్రీనివాస్, జడ్పీటీసీ బద్దం రవి అన్నారు. మోర్తాడ్, సుంకెట్, పాలెం, ధర్మోరా గ్రామాల్లో పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను గురువారం పంపిణీ చేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కల్లెడ ఏలియా, వైస్ఎంపీపీ శ్రీనివాస్, సర్పంచులు ధరణి, సంతోష్, మండల రాజేశ్వర్, శ్రీనివాస్, ఎంపీటీసీలు రాజ్పాల్, లావణ్య, రైతుబంధు కో-ఆర్డినేటర్ జేసీ గంగారెడ్డి, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు రమేశ్, నవీన్, హన్మంతు, ఉపసర్పంచులు రవి, గంగారెడ్డి, పృథ్వీ, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఆర్మూర్ పట్టణంలో పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, బల్దియా కౌన్సిలర్లు లబ్ధిదారులకు అందజేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులు ఎమ్మెల్యే జీవన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పండిత్ పవన్, మున్సిపల్ కౌన్సిలర్లు అతీఖ్, జహీర్అలీ, సయ్యద్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు.
కమ్మర్పల్లి మండలంలోని కమ్మర్పల్లి, బషీరాబాద్ గ్రామా ల్లో పలువురికి మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్థానిక ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు అందజేశారు. కార్యక్రమా ల్లో సర్పంచులు గడ్డం స్వామి, అశోక్, ఉపసర్పంచ్ గంగారాం, టీఆర్ఎస్ నాయకులు చింత గణేశ్, కొత్తపల్లి రఘు, శ్రీనివాస్, బద్దం రాజేశ్వర్, బాషా, మహేందర్, లోలం సుమన్, అంత రాజేశ్వర్, ఉపసర్పంచులు విక్రమ్, దేవేందర్, అబ్బయ్య, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
నవీపేట మండలంలోని లింగాపూర్ గ్రామానికి చెందిన మగ్గిడి మల్కన్నకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును కవితక్క షకీలన్న యువసేన మండల ఉపాధ్యక్షుడు మల్లెపూల గంగాధర్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు గాండ్ల పోతన్న, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు టేకు పోశెట్టి అందజేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మిట్టపల్లి జలంధర్, కోరె రవి, కల్లెం రాములు, అజయ్, శివ తదితరులు పాల్గొన్నారు.
బాల్కొండ మండలంలోని ఏడు గ్రామాలకు చెందిన పలువురికి మంజూరైన 28 సీఎంఆర్ఎఫ్ చెక్కులను మండల కేంద్రంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బద్దం ప్రవీణ్రెడ్డి బాధిత కుటుంబీకులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ లావణ్యా లింగాగౌడ్, జడ్పీటీసీ దాసరి లావణ్యా వెంకటేశ్, వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యుడు తౌట్ గంగాధర్, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.