బోధన్ రూరల్, మే 17: గ్రామాల్లో ప్రతి ఇంటికీ మిషన్ భగీరథ నీటిని సరఫరా చేసేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని ఆర్డీవో రాజేశ్వర్ అన్నారు. బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో మిషన్ భగీరథపై పంచాయతీ కార్యదర్శు లు, సర్పంచులు, సంబంధిత అధికారులతో ఆయన మంగళవారం సమీక్షను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ.. అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి మిషన్ భగీరథ నీరు సరఫరా అయ్యేలా చూడాలన్నారు. మిషన్ భగీరథ నీళ్లను ట్యాంకులకు అందించే బాధ్యత సంబంధిత అధికారులదని, ట్యాంక్ నుంచి గ్రామంలో ప్రతి ఇంటికీ సరఫరా చేసే బాధ్యత మాత్రం కార్యదర్శులదే అని చెప్పారు. గ్రామాల్లో పైప్లైన్లకు లీకేజీలు ఉంటే సరిచేయాలన్నారు. నెలాఖరు వరకు పల్లెప్రగతిలో భాగంగా చేపట్టే సమస్యలను గుర్తించాలని, అందుకోసం సర్పంచ్, పంచాయతీ కార్యదర్శులు గ్రామంలో సందర్శించాలని సూచించారు. ఆర్డబ్ల్యూఎస్ డీఈ మున్నీనాయక్, ఎంపీడీవో మధుకర్, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.