ఖలీల్వాడి, మే 14 : ఉపఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి అన్నారు. జిల్లా కేంద్రంలో ఆయన అధికారులతో శనివారం సమావేశం ఏర్పాటు చేసి ఉపఎన్నికల ఏర్పాట్లపై సమీక్షించారు. జిల్లాలో వివిధ కారణాలతో ఖాళీగా ఉన్న సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డుసభ్యులు, ఎంపీటీసీ, కౌన్సిలర్ స్థానాల వివరాలను తెలుసుకున్నారు. జిల్లాలో మొత్తం 10 సర్పంచ్, 14 ఉపసర్పంచ్, 135 వార్డుసభ్యులు, ఒక ఎంపీటీసీ స్థానం, బోధన్ మున్సిపాలిటీ పరిధిలోని ఒక కౌన్సిలర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయని జిల్లా అధికారులు కమిషనర్కు వివరించారు. ఈ సందర్భంగా పార్థసారథి మాట్లాడుతూ.. గ్రామాల్లో ఖాళీగా ఉన్న స్థానాలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం జూన్లో నోటిఫికేషన్ వెలువరించే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు అన్ని విధాలుగా సమాయత్తమై ఉండాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాలను ఈనెల 24వ తేదీ వరకు గుర్తించి ఓటిం గ్ ప్రక్రియ కోసం సిద్ధం చేయాలని సూచించారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఇప్పటికే ఓటర్ల జాబితాను ఖరారు చేసి, డ్రాఫ్ట్ పబ్లికేషన్ ప్రక్రియను పూర్తిచేశామని, జక్రాన్పల్లి వైస్ ఎంపీపీ ఎన్నికకు సంబంధించి ఈనెల 7న నోటిఫికేషన్ వెలువరించామని, 23న ఎన్నిక నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశామని అధికారులు కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ చిత్రామిశ్రా, డీసీపీ వినీత్, డీపీ వో జయసుధ, జడ్పీ సీఈవో గో వింద్, ఆర్డీవో రవి పాల్గొన్నారు.