కంఠేశ్వర్, ఫిబ్రవరి 20: నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అహంకారం జిల్లా ప్రజలందరికీ తెలుసని నిజామాబాద్ డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్రెడ్డి విమర్శించారు. నిజామాబాద్లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. అసమర్థుడైన అర్వింద్ను ఎంపీగా గెలిపించడం వల్ల ఐదేండ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. అలాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించడం ఇష్టం లేక ఇటీవల జరిగిన ఎన్నికల్లో కోరుట్ల ప్రజలు చెంప చెల్లుమనేలా ఓడగొట్టారన్నారు.
అసమర్థుడు, అహంకారి అయిన అర్వింద్ మళ్లీ ఎంపీ కావడం ఇష్టం లేని బీజేపీ కార్యకర్తలే ఆయనకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తున్నారని, కరపత్రాలు పంచి పెడుతున్నారన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని చెప్పారు.