ఖలీల్వాడి మార్చి 6: నిజామాబాద్ జిల్లా శిశు సంక్షేమ శాఖలో పని చేస్తున్న నందిని రాష్ట్ర ప్రభుత్వ పురస్కారానికి ఎంపికయ్యారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందిస్తున్న 27 మందిని రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. వీరికి ఈ నెల 8న హైదరాబాద్లో జరుగనున్న కార్యక్రమంలో రూ.లక్ష నగదుతో పాటు ఘనంగా సన్మానించనుంది.
రాష్ట్ర ప్రభుత్వ పురస్కారానికి నిజామాబాద్ అర్బన్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ నందిని ఎంపికయ్యారు.