బోధన్/శక్కర్నగర్, డిసెంబర్ 1: సబ్ ఇన్స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల రాతపరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఈనెల 3న మాక్ టెస్ట్ నిర్వహించనున్నట్లు బోధన్ ఏఎంసీ చైర్మన్ వెంకటేశ్వర్రావు దేశాయ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్, ఆయన సతీమణి ఆయేషా ఫాతిమా సహకారంతో ఈకార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. శక్కర్నగర్లోని క్రీడా మైదానంలో శనివారం ఉదయం 5.30 గంటలకు మాక్టెస్టు, అనంతరం అవగాహన శిబిరం నిర్వహించనున్నట్లు వివరించారు. రాత పరీక్షలో అర్హత సాధించిన నియోజకవర్గంలోని అభ్యర్థులు హాజరు కావాలని కోరారు. టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు గ్రామాల్లో అభ్యర్థులకు సమాచారం అందించాలని కోరారు.
క్రీడా మైదానంలో ఏర్పాట్ల పరిశీలన
బోధన్ నియోజకవర్గంలో ఎస్సై, కానిస్టేబుల్ రాతపరీక్షల్లో అర్హత సాధించి దేహదారుఢ్య పరీక్షలతో పాటు, ఇతర అంశాల్లో నిర్వహించే పోటీలకు సిద్ధమయ్యే యువతీయువకులకు ఒకరోజు శిక్షణ ఇచ్చేందుకు శక్కర్నగర్ క్రీడా మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక బోధన్ ఎమ్మెల్యే మహమ్మద్ షకీల్, ఆయన సతీమణి ఆయేషా ఫాతిమాల ఆధ్వర్యంలో ఉద్యోగార్థులకు ఒకరోజు శిక్షణ ఇప్పించేందుకు గాను చర్యలు చేపట్టారు. శక్కర్నగర్లోని క్రీడా మైదానంలో ఈనెల 4న ఉదయం 5.30 గంటల నుంచి సాయంత్రం వరకు పోలీస్ ఈవెంట్లపై పలువురు నిఫుణులు అవగాహన కల్పిస్తారు. క్రీడా మైదానంలో ఏర్పాట్లను గురువారం బోధన్ పట్టణ సీఐ బీడీ ప్రేమ్ కుమార్, మున్సిపల్ డీఈఈ లింగంపల్లి శివానందం, పీడీ సంగీత్రావు, టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకుడు ప్రీతం దేశాయ్లు పర్యవేక్షించారు.