ఆర్మూర్/ఖలీల్వాడి, ఆగస్టు 23: ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రమేయం ఉందంటూ బీజేపీ చేస్తున్న దుష్ప్రచారంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అండగా నిలిచారు. హైదరాబాద్లో మంగళవారం ఆమెను కలిసి పరామర్శించారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి, టీఎస్ ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా, బోధన్ ఎమ్మెల్యే షకీల్, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్, ఎమ్మెల్సీ కవితను కలిశారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై బీజేపీ కార్యకర్తల దాడిని ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండించారు.