వేల్పూర్, మే 26: అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం ప్రెస్నో నగరం పొలిమేరలో ఉన్న కర్నీ అగ్రికల్చర్ పార్కును స్థానికురాలు క్యాండీస్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆదివారం సందర్శించారు. అక్కడ సేంద్రియ పద్ధతుల్లో స్వీట్ పొటాటో(రత్నపురిగడ్డ), ఇతర కూరగాయ పంటలను సాగు చేసే తీరును పరిశీలించారు. ఇండో ఆఫ్రికన్ రైతు ప్రతినిధి, పార్కు మేనేజర్ క్రిస్ఫీల్డ్, మహిళా రైతు హేన్స్ను ఆధునిక సాగు విధానాలను అడిగి తెలుసుకున్నారు. అక్క డ పని చేస్తున్న రైతు కూలీ జూన్తో మాట్లాడి పంటల సాగు వివరాలు ఎమ్మెల్యే తెలుసుకున్నారు.