నందిపేట్, డిసెంబర్ 3: ఆర్మూర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ఎంపీ అర్వింద్ బహిరంగ చర్చకు సిద్ధమా అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి సవాల్ విసిరారు. ‘నమస్తే నవనాథపురం’లో భాగంగా జీవన్రెడ్డి శనివారం ఆర్మూర్ పట్టణంలోని 9వ వార్డు, మంథని, పిప్రి గ్రామాల్లో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలో పాల్గొని వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఉదయం 3వ వార్డులో పర్యటించారు.
2016లో సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో మాట్లాడి ఆర్వోబీని మంజూరు చేయించారని ఎమ్మెల్యే అన్నారు. అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవ తీసుకుని రూ.25 కోట్లు విడుదల చేయించి పనులు ప్రారంభించారన్నారు. చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న బ్రిడ్జి పనులను వచ్చే ఏప్రిల్లోగా పూర్తయ్యేలా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని ఎమ్మెల్యే తనిఖీ చేశారు. మంథనిలో మహిళా భవన్కు రూ.10లక్షలు మంజూరు చేసినట్లు వెల్లడించారు. మార్కెట్ యార్డులో ఫంక్షన్ హాల్కు రూ.30లక్షలు, రంగనాయక ఆలయానికి సీసీ రోడ్డు నిర్మాణం కోసం రూ.48 లక్షలు మంజూరు చేశామన్నారు.
టూరిజం స్పాట్గా పిప్రి కుడి చెరువు
పిప్రి గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే జీవన్రెడ్డి పిప్రి కుడి చెరువును టూరిజం స్పాట్గా తీర్చిదిద్దుతామన్నారు. పర్యాటకశాఖ ఎండీతో ఫోన్లో మాట్లాడి పిప్రి కుడి చెరువుపై వివరించారు. ఎంపీ అర్వింద్ కేంద్రం నుంచి ఎన్ని నిధులు తెచ్చాడని ప్రశ్నించారు. నమస్తే నవనాథపురం నిరంతరం కొనసాగుతుందని జీవన్రెడ్డి పేర్కొన్నారు. కార్యక్రమంలో 9వ వార్డులో ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినితా పవన్, వైస్చైర్మన్ మున్నా, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్గౌడ్, కౌన్సిలర్ కవితా కాశీరాం, వార్డు కౌన్సిలర్లు సంగీతా రవిగౌడ్, ఆకుల రాము, మంథని సర్పంచ్ లింబారెడ్డి, ఎస్పీ నర్సారెడ్డి, జీకే నర్సారెడ్డి, పిప్రిలో సర్పంచ్ అసపురం దేవీ శ్రీనివాస్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ హేమంత్రెడ్డి, వీడీసీ సభ్యులు పాల్గొన్నారు.