ఎల్లారెడ్డి రూరల్, ఆగస్టు 26: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలోనే నంబర్వన్గా ఉందని ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. శుక్రవారం ఎల్లారెడ్డి మండల పరిధిలోని తిమ్మారెడ్డి గ్రామంలో నూతన ఆసరా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ.. రెండేండ్లుగా ఎదురుచూస్తున్న నూతన పింఛన్లు వచ్చాయన్నారు. గ్రామాల్లో పర్యటించినప్పుడు పెన్షన్ల కోసం మహిళలు అడుగుతుంటే చాలా బాధ వేసేదన్నారు. నియోజకవర్గ సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లడంతో ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నారని తెలిపారు.
రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం సహకరించకపోయినా సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలను అమలుచేస్తున్నారని అన్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ఇందు కు వ్యవసాయానికి ఉచితంగా 24గంటల విద్యుత్ సరఫరా చేయడమే నిదర్శనమన్నారు. రైతన్నలకు ఎటువంటి అప్పులు కావద్దనే ఉద్దేశంతో రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. అధికారమే లక్ష్యంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందకు ప్రయత్నిస్తున్నదని ఆరోపించారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి కండ్లు మండి ఏం చేయా లో అర్థంకాని పరిస్థితిలో బీజేపీ నాయకులు కొట్టుమిట్టాడుతున్నారని విమర్శించారు. అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. తిమ్మారెడ్డి గ్రామంలో అసంపూర్తిగా మిగిలిన దళితులు, గంగపుత్రులకు సంబంధించిన కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులను పూర్తిచేస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ, ఎంపీపీ కర్రె మాధవీగౌడ్, జడ్పీటీసీ ఉషాగౌడ్, సర్పంచ్ అలీల్పాషా, ఎల్లారెడ్డి, వెల్లుట్ల సొసైటీ అధ్యక్షులు ఏగుల నర్సింహులు, పటేల్ సాయిలు, ఎంపీటీసీ జంగిటి ఉమాదేవి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జలందర్రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఆదిమూలం సతీశ్కుమార్, గ్రామపెద్దలు గంగారెడ్డి, వసంతం, విఠల్, నర్సింహారెడ్డి, మోహన్రెడ్డి, సాయాగౌడ్, అన్నాసాగర్ సర్పంచ్ పెరుగు నాగరాజు, ఆజామాబాద్ సర్పం చ్ గొట్టం సాయిలు, డీఎల్పీవో సురేందర్, ఎంపీడీవో మల్లిఖార్జున్రెడ్డి, ఎంపీవో అతినారపు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.