నిజాంసాగర్, మార్చి 25 : సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో కలిసికట్టుగా ఉంటూ.. ఇదే స్ఫూర్తితో ముందుకుసాగితే జుక్కల్ నియోజకవర్గంలో మళ్లీ మనదే విజయమని ఎమ్మెల్యే హన్మంత్షిండే ధీమా వ్యక్తంచేశారు. పెద్దకొడప్గల్ మండల కేంద్రంలోని క్రీడా ప్రాంగణంలో శనివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. మండలంలోని 23 గ్రామాల కార్యకర్తలు, నాయకులు, బీఆర్ఎస్ గ్రామ క మిటీల సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, మార్కెట్ కమి టీ డైరెక్టర్లు, సొసైటీ చైర్మన్లు, వార్డు సభ్యులతో ఎమ్మెల్యే షిం డే భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని అన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూ చించారు. తెలంగాణ ఏర్పడక ముందు, తర్వాత జరిగిన మార్పును ప్రజలకు స్పష్టంగా అర్థమయ్యేలా వివరించాలన్నారు. పక్క రాష్ర్టాలతో పోలిస్తే అభివృద్ధి అంటే ఏమిటో తెలుస్తుందన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో రూ.600కు మించి పింఛన్లు ఇవ్వడంలేదని, తెలంగాణలో ఒంటరి మహిళలకు రూ.2016, దివ్యాంగులకు రూ.3016 పింఛన్ ఇస్తున్నామని తెలిపారు. జుక్కల్ నుంచి నాలుగు పర్యాయాలు ఎన్నికైన నాయకుడు.. తన సొంత గ్రామం పెద్దకొడప్గల్ను పట్టించుకున్న పాపన పోలేదని గుర్తుచేశారు.
బిచ్కుంద మండలంలో ఉన్న పెద్దకొడప్గల్ గ్రామాన్ని మం డలంగా మార్చుకున్నామని, అందుకే నేడు అందరం కలిసి ఆత్మీయసమ్మేళనం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. మండలంలోని ప్రతి పల్లెలో సీసీ రోడ్లు, మురికి కాలువలు, బీటీ రోడ్డు వేసుకున్నామని గుర్తుచేశారు. మరో రెండు మూడు గ్రామాలకు బీటీ రోడ్లు అవసరం ఉండగా ఇటీవల జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్తో, పిట్లం మండలానికి వచ్చిన మంత్రి కేటీఆర్తో విన్నవించామని తెలిపారు. త్వరలో ఆ గ్రామాల్లో కూడా బీటీ రోడ్డు పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందు జుక్కల్ నియోజకవర్గంలోని 77గ్రామాలకు రోడ్లు కూడా లేవని గుర్తుచేశారు. ఇప్పుడు పది గ్రామాలు మినహా అన్ని ఊళ్లకు బీటీ రోడ్లు వేసి రవాణా సౌకర్యాన్ని మెరుగుపర్చామని తెలిపారు. మరో నాలుగు విద్యుత్ సబ్స్టేషన్లు, 132 కేవీ సబ్స్టేషన్ పనులు కూడా త్వరలో ప్రారంభం కాబోతున్నాయని తెలిపారు. ఎంపీ బీబీ పాటిల్ చొరవతో ఫోర్లేన్ నేషనల్ హైవే నిర్మించుకున్నామని, దీంతో ఇక్కడి భూములకు డిమాండ్ పెరిగిందన్నారు. నియోజకవర్గానికి 3వేల డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరయ్యాయని, అవి సరిపోవని చెప్పడంతో అదనంగా మరో మూడు వేల ఇండ్లు ఇచ్చారని తెలిపారు. వచ్చేనెల నుంచి స్థలం ఉన్న వారు ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షల చొప్పున మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. బతుకమ్మ పండుగను ప్రపంచానికే పరిచయం చేసిన తెలంగాణ ఆడపడుచు ఎమ్మెల్సీ కవితక్కపై బీజేపీ ప్రభుత్వం అడ్డమైన కేసులుపెట్టి ఇబ్బందిపెడుతోందని, ఇలాంటి దుశ్చర్యలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి, సంక్షేమంలో పోటీపడే సత్తాలేక ఐటీ, ఈడీ దాడులకు పూనుకుంటుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల్లో ఎకతాటిపై ఉంటూ బీజేపీ, కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టాలన్నారు.
రానున్న ఎన్నికల్లో హన్మంత్షిండేను 72 వేల మెజార్టీతో గెలిపిస్తామని ఎంపీపీ ప్రతాప్రెడ్డి అన్నా రు. మొదటి సారి 30 వేలు, రెండోసారి 34 వేలు, మూడోసారి 36వేల మెజార్టీ వచ్చిందని గుర్తుచేశారు. మంత్రి కేటీఆర్ ఇటీవల పర్యటన సందర్భంగా సూచించిన విధంగా రానున్న ఎన్నికల్లో రెండింతల మెజార్టీ ఓట్లతో గెలిపిస్తామన్నారు. షిండే ఏనాడూ స్వార్థం కోసం పైరవీలు చేయలేదని, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తెలిపారు. అనంతరం గ్రామాల వారీగా చేపట్టిన అభివృద్ధి పనులు, ఇంకా మిగిలిఉన్న పనులపై చర్చించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చంద్రభాగ, బీఆర్స్ మండల అధ్యక్షుడు విజయ్దేశాయ్, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు నాగ్నాథ్పటేల్, వైస్ ఎంపీపీ ఖండేరావ్పటేల్, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు తిర్మల్రెడ్డి, కో-ఆప్షన్ సభ్యుడు జాఫర్షా, సొసైటీ చైర్మన్ హన్మంత్రెడ్డి తదితరులు ఉన్నారు.