నిజామాబాద్ : బోధన్లో మత సామరస్యాన్ని కాపాడేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని బోధన్ ఆర్డీఓ రాజేశ్వర్ అన్నారు. మంగళవారం ఆర్డీఓ రాజేశ్వర్, ఏసీపీ రామారావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. బోధన్లో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా గత రెండురోజులుగా పట్టణ ప్రముఖులు, ఇరు వర్గాలకు చెందిన పెద్దలతో సమావేశాలు నిర్వహించామన్నారు.
విగ్రహాల ఏర్పాటు విషయంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఓ కమిటీ ఏర్పాటుకు సూచించామన్నారు. ఇందుకుగాను సదరు పెద్దలుకూడా అధికారులకు పూర్తి సహకారం అందిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం బోధన్ లో పరిస్థితి ప్రశాంతంగా ఉందన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టేలా ఎవరైనా పోస్టింగ్ లు పెడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.