మాక్లూర్, జనవరి 27: కంటి వెలుగు కార్యక్రమం పేదల జీవితాల్లో కాంతి నింపుతోందని జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు అన్నారు. మండలంలోని చిక్లీ గ్రామంలో శుక్రవారం కంటి వెలుగు శిబిరాన్ని జడ్పీ చైర్మన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు రోజులపాటు గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం కొనసాగుతుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక అయిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని, ఈ ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో క్రాంతి, ఎంపీవో శ్రీనివాస్, మెడికల్ ఆఫీసర్ సరిత, ఎంపీటీసీ కారం సుజాత, ఉపసర్పంచ్ రవి, నాయకులు శేఖర్, నరేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
బోధన్, జనవరి 27: పట్టణంలో కొనసాగుతున్న కంటివెలుగు శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ తూము పద్మావతి సూచించారు. శుక్రవారం పట్టణంలోని 19, 26 వార్డుల్లోని కంటివెలుగు కేంద్రాలను ఆమె మున్సిపల్ కమిషనర్ ఎండీ ఖమర్ అహ్మద్, పలువురు కౌన్సిలర్లతో కలిసి సందర్శించారు. వార్డుల్లో కంటివెలుగు కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను ఆమె నేరుగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని ఆమె సూచించారు. వార్డుల్లో ఏర్పాటు చేసిన కంటివెలుగు కేంద్రాల్లో ఏవైనా ఇబ్బందులుంటే మున్సిపల్ అధికారులకు తెలియజేయాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు తూము శరత్రెడ్డి, అంకు సంధ్యా దామోదర్, పిట్ల సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకుడు ఆబేద్ ఉన్నారు.
కంటి వెలుగు శిబిరం ప్రారంభం
భీమ్గల్, జనవరి 27: మండల కేంద్రంలోని 2వ వార్డులో 2వ విడుత కంటి వెలుగు శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ కన్నె ప్రేమలతా సురేందర్, వార్డు కౌన్సిలర్ లింగయ్యతో కలిసి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులు ప్రభుత్వ దవాఖాన భవనంలో ఏర్పాటు చేసిన శిబిరంలో ప్రజలు కంటి పరీక్షలు చేయించుకోవాలని, ప్రభుత్వం అందిస్తున్న కండ్ల అద్దాలను తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యురాలు యాసిన్ ఫాతిమా, 6వ వార్డు కౌన్సిలర్ గంగాధర్, ఆశ, అంగన్వాడీ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
వేల్పూర్లో ..
వేల్పూర్, జనవరి 27: మండల కేంద్రంలో కంటి వెలుగు శిబిరాన్ని శుక్రవారం జడ్పీటీసీ అలకొండ భారతి ప్రారంభించి మాట్లాడారు. కంటి వెలుగు శిబిరాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ తీగెల రాధా మోహన్, ఎంపీపీ బీమా జమున, ప్రభుత్వ వైద్యుడు అశోక్, ఉపసర్పంచ్ పిట్ల సత్యం, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.