కంఠేశ్వర్, మార్చి 24 : సెపక్తక్రా తెలంగాణ సబ్జూనియర్ బాలికల జట్టు కెప్టెన్గా నిజామాబాద్ జిల్లాకు చెందిన లాస్యప్రియ ఎంపికైనట్లు సెపక్తక్రా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గాదారి సంజీవ్రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 నుంచి 30వ తేదీ వరకు కర్ణాటకలోని ధవనగిరిలో నిర్వహించే 26వ సెపక్తక్రా సబ్జూనియర్ టోర్నమెంట్కు లాస్యప్రియ కెప్టెన్గా వ్యవహరించనున్నట్లు తెలిపారు. ఆమెను జిల్లా అధ్యక్షుడు కేశవేణు, ఉపాధ్యక్షులు దీపిక, గంగారెడ్డి, సంయుక్త కార్యదర్శి మీసాల ప్రశాంత్, పలు క్రీడా సంఘాల ప్రతినిధులు అభినందించారు.