Pothangal | పోతంగల్, జులై 24 : నేటి యువతరానికి కేటీఆర్ స్ఫూర్తిగా నిలుస్తారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుధాం నవీన్ అన్నారు. పోతంగల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పాఠశాలలోని విద్యార్థులకు పండ్లు, మండల కేంద్రంలోని పీహెచ్సీలో రోగులకు పండ్లు, బ్రెడ్, పాలు పంపిణీ చేశారు.
అలాగే బీఆర్ఎస్ నాయకుడు డాక్టర్ ఎంఏ హకీం నేటి నుండి పోతంగల్ మండలంలో నిరుపేద కుటుంబంలో మొదటి కాన్పుగా ఆడబిడ్డ జన్మిస్తే తాత కానుకగా రూ.5 వేల సహాయాన్ని అందజేస్తానని కేటీఆర్ జన్మదినం సందర్భంగా ప్రకటించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడమే లక్ష్యంగా కేటీఆర్ చేస్తున్న కృషి అభినందించదగినదన్నారు. ఇటీవల కంటి ఆపరేషన్ చేసుకున్న గ్రామానికి చెందిన కన్నం హన్మండ్లుకు రూ.5వేల ఆర్థిక సాయాన్ని ఎంఏ హకీం అందజేశారు. ఈ కార్యక్రమంలో అరిఫ్, ఆంజనేయులు, ఎజాజ్, గంగాధర్, హన్మంతు, సుదం సాయిలు, సురేష్ పటేల్, రాములు, సురేష్ తదితరులు పాల్గొన్నారు.