మాచారెడ్డి, ఫిబ్రవరి 2: మండలంలోని ఘన్పూర్, గజ్యానాయక్ తండా, మాచారెడ్డి గ్రామా ల బీఆర్ఎస్ నాయకులు సీఎం కేసీఆర్, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ చిత్ర పటాలకు గురువారం క్షీరాభిషేకం చేశారు. మండలంలోని ఘన్పూర్ స్టేజీ నుం చి గజ్యానాయక్ తండా మీదు గా మాచారెడ్డి హైస్కూల్ వరకు ఫోర్వే, సెంట్రల్ లైటింగ్, డివైడర్తో పాటు డ్రైనేజీ నిర్మాణానికి రూ.14 కోట్ల నిధులు మంజూరు చేసినందుకు హర్షం వ్యక్తంచేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా గ జ్యానాయక్తండాసర్పంచ్ హంజీనాయక్ మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని తెలిపారు. మాచారెడ్డి మండలాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్న ప్రభుత్వ విప్నకు రుణపడి ఉంటామని అన్నా రు. నిధుల మంజూరుకు కృషిచేసిన ఎంపీపీ నర్సింగ్రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచులు తోకల కిషన్, మల్లేశ్, మండల కో-ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ఖాన్, నాయకులు నారాయణ, లోయపల్లి శ్రీధర్రావు, జహంగీర్, జైనుల్, ప్రకాశ్, ఎల్లాగౌడ్, శ్రీరాం, శ్రీనివాసాచారి, హన్మంత్రావు, ఎడపల్లి శ్రీనివాస్, మల్లేశ్, నారాగౌడ్, వెంకటిగౌడ్, ఎజాజ్ తదితరులు పాల్గొన్నారు.