కమ్మర్పల్లి, సెప్టెంబర్ 9 : కమ్మర్పల్లి మండల కేంద్రంలో రుద్ర సేన, రైజింగ్ యువజన సంఘాలకు చెందిన 50 మంది యువకులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో శుక్రవారం టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేలా కేంద్రంలోని బీజేపీ సర్కారు అవలంబిస్తున్న వైఖరితో రాష్ట్రంలో కేసీఆర్ పాలన మరింత ముందుకు పోవాల్సిన ఆవశ్యకతను యువత గుర్తిస్తోందన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను బీజేపీ అడ్డుకుంటున్న విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు.