కామారెడ్డి : తెలంగాణలోని అన్ని మున్సిపాలిటీలల్లో ప్రభుత్వం రూ.500 కోట్లతో సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపడుతుందని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. బతుకమ్మల చీరల తయారీకి రూ.330 కోట్ల కేటాయించి చేనేత కుటుంబాలకు చేయుత నిస్తుందని పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్లో జాతిపితా
మహాత్మాగాంధీ నూతన విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం బతుకమ్మ చీరలను పంపిణీ చేసి మాట్లాడారు. కామారెడ్డి గాంధీగంజ్లో సమీకృత మార్కెట్ కోసం రూ. 7కోట్ల 20 లక్షలను ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడిం చారు. మార్కెట్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. పట్టణ ప్రాంతాల్లోని కూరగాయల మార్కెట్తో పాటు మటన్, చికెన్ మార్కెట్ కూడా ఒకే దగ్గర ఉండాలని సీఎం నిర్ణయించారని తెలిపారు.
కామారెడ్డి జిల్లా కేంద్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని పేర్కొన్నారు. కామారెడ్డిలో పెండింగ్లో ఉన్న రోడ్డు పనులు త్వరలో పూర్తి అవుతాయన్నారు. టెక్రియాల్ నుంచి నర్సన్నపల్లి రోడ్డు వెడల్పు పనులకు 23 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. కామారెడ్డి జిల్లాలో 98,500 రేషన్ కార్డులు కలిగిన మహిళలందరికీ బతుకమ్మ చీరలను అందస్తున్నామన్నారు. అసెంబ్లీ ఆవరణలో ఉన్న మాదిరిగా కామారెడ్డిలో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అనందంగా ఉందన్నారు.
6నెలల పాటు శ్రమించి పనులు చేసిన శిల్పి కిశోర్ను విప్ గోవర్ధన్ అభినందించారు. టీఆర్ఎస్ మైనార్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంకే ముజీబొద్దిన్, రాష్ట్ర నాయకులు నిట్టు వేణుగోపాల్ రావు, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకటేశ్ దోత్రే, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, మున్సిపల్ చైర్మన్ నిట్టు జాహ్నవి, వైస్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి, మార్కెట్ చైర్మన్ రాజమణి, తదితరులు పాల్గొన్నారు.