దోమకొండ, ఫిబ్రవరి12: గ్రామాభివృద్ధిలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. మండలంలోని సీతారాంపల్లిలో పలు అభివృద్ధి పనులను ఆయన శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీతారాంపల్లి గ్రామాన్ని స్థానిక వ్యాపారవేత్త సుభాష్రెడ్డి దత్తత తీసుకుని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నారన్నారు. గ్రామంలో తన సొంత ఖర్చులతో మురికి కాలువలు, సీసీరోడ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, జలవనరుల సంరక్షణ, మౌలిక వసతులు, పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా రెండు పడక గదులను నిర్మించారని, బీబీపేటలో కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను నిర్మించారని గుర్తుచేశారు. అనంతరం గ్రామస్తులతో కలిసి స్వచ్ఛ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ జితేశ్ పాటిల్, డీఎస్పీ సోమనాథం, జడ్పీ వైస్ చైర్మన్ ప్రేమ్కుమార్, జడ్పీటీసీ సభ్యుడు తిర్మల్గౌడ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మధుసూదన్రావు, సింగిల్విండో చైర్మనర్ రవీందర్రెడ్డి, నాగరాజురెడ్డి, తిరుపతిగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఆపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభం
కామారెడ్డి, ఫిబ్రవరి 12 : జిల్లాకేంద్రంలోని గోదాం రోడ్లో ఆపిల్ డయాగ్నోస్టిక్ సెంటర్, ల్యాబ్ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ శనివారం ప్రారంభించారు. పట్టణ ప్రాంత ప్రజలకు అధునాతన, నాణ్యమైన వైద్యసేవలను అందించాలని వైద్యులకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పున్న రాజేశ్వర్, ఆపిల్ డయాగ్నస్టిక్ సెంటర్ యజమాని డాక్టర్ కరుణాకర్రెడ్డి, నాయకులు కుంచాల శేఖర్, యోగా రాంరెడ్డి, రామేశ్వర్పల్లి సర్పంచ్ పోతిరెడ్డి, వీడీసీ అధ్యక్షుడు తక్కళ్ల నర్సారెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు నంద రమేశ్, గజ్జల భిక్షపతి, అమృత్రావు పాల్గొన్నారు.