కామారెడ్డి, మే 25: కామారెడ్డి జిల్లా వైద్యాధికారి డాక్టర్ లక్ష్మణ్సింగ్పై సస్పెన్షన్ వేటుపడింది. మహిళా వైద్యులను లైంగికంగా వేధించినట్లు తేలడంతో రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ ప్రభుత్వ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ శనివారం సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. తమపై డీఎంహెచ్వో లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని 15 రోజుల క్రితం పీహెచ్సీలో పనిచేస్తున్న మహిళా మెడికల్ ఆఫీసర్లు ఉన్నతాధికారులతోపాటు జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేశారు.
అనంతరం దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ నెల 15న ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ అమర్సింగ్ నాయక్ కామారెడ్డి వచ్చి విచారణ చేపట్టారు. అదే రోజు సాయంత్రం పోలీసులు డాక్టర్ లక్ష్మణ్సింగ్ను అదుపులోకి తీసుకొని 16న కోర్టులో ప్రవేశపెట్టగా బెయిల్పై బయటికి వచ్చారు. విచారణ అధికారితోపాటు కలెక్టర్, ఎస్పీ ఇచ్చిన నివేదికతో డీఎంహెచ్వోను సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.